హీరో రామ్ వరుస సినిమాలలో బిజీగా ఉన్నాడు. ఆయన ప్రస్తుతం కోలీవుడ్ డైరెక్టర్ ఎన్ లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.అయితే ఈ సినిమా గురించి ఈ మద్యనే ఒక అప్డేట్ బయటికి వచ్చింది . అదేంటి అంటే ఈ సినిమా కోసం ఒక స్టార్ నటుడిని విలన్ గా పెట్టాలి అని డైరెక్టర్ అనుకుంటున్నాడు అని వార్త . ఇక దీని కోసం తమిళ స్టార్ నటుడు మాధవన్ ను ఫిక్స్ చేశారు అని ఆయన కూడా వెంటనే ఒప్పుకున్నారు అని టాక్ వచ్చింది.ఇక ఇప్పుడు ఈ వార్త గురించి మాధవన్ క్లారిటీ ఇచ్చాడు.

 ఆయన లింగుస్వామి తో సినిమా చేయడానికి ఆసక్తిగా ఉన్నడని కానీ ఆయన రామ్ తో సినిమా చేస్తున్న వార్తలో ఎలాంటి నిజం లేదు అని ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు.ఇక మాధవన్ తెలుగులో ఇప్పటికే కొన్ని సినిమాల్లో నటించడు. ఇక తమిళంలో ఆయన ఒక స్టార్ హీరో గా నిలిచాడు.అలాగే నాగ చైతన్య సవ్యసాచి సినిమాలో కూడా మాధవన్ విలన్ గా నటించిన సంగతి తెలిసిందే. దానితో ఆయన సినిమా చేస్తున్న వార్తలు ఎక్కువయ్యాయి. ఇప్పుడు ఈ ట్విట్ తో ఆ వార్తలు అన్నిటికి ఒక ఫుల్ స్టాప్ పడినట్టు అయింది. 

ఇక ఈ సినిమాలో రామ్ సరసన ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తో పాటు రామ్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్ డైరెక్షన్ లో మరో సినిమా చేయనున్నాడు. అంతేకాకుండా పూరి జగన్నాథ్ దర్శకత్వం లో కూడా ఇస్మార్ట్ శంకర్ తర్వాత మరో సినిమా చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే హీరోగా రామ్  కూడా తన రేంజ్ పెంచుకోవాలని ఇలా వరుసగా స్టార్ డైరెక్టర్స్ తో సినిమాలు అంగీకరిస్తున్నాడు అని ఇండస్ట్రీలో టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: