మహానటి కీర్తి సురేష్ ఈమధ్య సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఆమె చేస్తున్న సినిమాలతో పాటుగా సోషల్ మీడియాలో కీర్తి సురేష్ అప్డేట్స్ కూడా ఆమె ఫ్యాన్స్ ను అలరిస్తున్నాయి. ఇక లేటెస్ట్ గా కీర్తి సురేష్ తన పార్ట్ నర్ తో షేర్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చల్లని వాతావరణం.. బీచ్ ఒడ్డున.. సరైన పార్ట్ నర్ తో ఇంతకంటే ఏం కావాలంటూ కీర్తి సురేష్ పెట్టిన పోస్ట్ ఇప్పుడు అందరిని సర్ ప్రైజ్ చేస్తుంది. ఇంతకీ కీర్తి సురేష్ పార్ట్ నర్ ఎవరంటే ఆమె పెట్. పెట్ తో కీర్తి సురేష్ బీచ్ లో సేదతీరుతుత్న్న ఫోటో షేర్ చేసింది. అయితే టైటిల్ పార్ట్ నర్, కంపానియన్ అంటూ పెట్టేసరికి కీర్తి సురేష్ ప్రేమలో పడ్డదా అంటూ అందరు షాక్ అయ్యారు.

తెలుగు, తమిళ, మళయాళ భాషల్లో వరుస సినిమాలతో సత్త చాటుతున్న కీర్తి సురేష్ తెలుగులో ప్రస్తుతం మహేష్ సరసన సర్కారు వారి పాట సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాతో పాటుగా మరో స్టార్ సినిమా డిస్కషన్స్ లో ఉందని తెలుస్తుంది. మళయాళంలో ఆమెకు వరుస ఛాన్సులు వస్తున్నాయి. అక్కడ కూడా తన హవా కొనసాగిస్తుంది కీర్తి సురేష్. ఈమధ్యనే నితిన్ సరసన రంగ్ దే సినిమాలో నటించి మెప్పించింది కీర్తి సురేష్.

ఓ పక్క చేతినిండా సినిమాలతో ఫుల్ ఫాం లో ఉన్న అమ్మడు లాక్ డౌన్ టైం లో షూటింగ్ కు బ్రేక్ రావడంతో ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తుంది. లేటెస్ట్ గా బీచ్ ఒడ్డున తన పెట్ తో కీర్తి సురేష్ పెట్టిన పిక్ మాత్రం ఆమె ఫ్యాన్స్ ను విశేషంగా ఆకట్టుకుంటుంది.  అందంతో పాటు అభినయంతో కూడా అలరిస్తున్న కీర్తి సురేష్ తన క్రేజ్ చూస్తుంటే మరో ఐదారేళ్లు స్టార్ ఫాం కొనసాగించేలా ఉంది. తెలుగు, తమిళ భాషల్లో ఆమె నటించిన గుడ్ లక్ సఖి సినిమా ఓటిటిలో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.


 


మరింత సమాచారం తెలుసుకోండి: