సోషల్ మీడియా పుణ్యమా అని సామాన్యులు కూడా ఇప్పుడు స్టార్లుగా సెలబ్రిటీలు గా మారిపోతున్నారు.  తమ కున్న టాలెంట్ ను సోషల్ మీడియాలో ప్రదర్శిస్తే చాలు వారిని వారి ప్రతిభని గుర్తించి చాలామంది వారికి మంచి మంచి అవకాశాలు పిలిచి మరీ ఇస్తున్నారు. ముఖ్యంగా సినిమా రంగంలో పలు శాఖల లో టాలెంట్ ఉన్న వారు తమ ప్రతిభను వీడియోలు గా చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే వారికి ఎక్కడో ఒక దగ్గర ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది. అందుకు ఉదాహరణ రణుమండల్.

దేశవ్యాప్తంగా నెటిజన్ ల దృష్టిని ఆకర్షించిన వారిలో ఈమె ఒకరు. పశ్చిమబెంగాల్లోని రాణా ఘాట్ రైల్వే స్టేషన్ లో పాటలు పాడుకుంటూ బిక్షాటన చేసుకునే ఈ మహిళ ఒకే ఒక వీడియో వైరల్ కావడంతో దేశం దృష్టిని ఆకర్షించింది. ఇంటర్నెట్ అందరికీ అందుబాటులోకి వచ్చాక సోషల్ మీడియా ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైపోయింది. సోషల్ మీడియా కేవలం అభిప్రాయాలను పంచుకునే వేదిక మాత్రమే కాకుండా టాలెంట్ ను నిరూపించుకో నివేదిక కూడా అయ్యింది. అలా సోషల్ మీడియా అండతో బాలీవుడ్ లో అవకాశాలు పొందింది రనుమండల్. 

అయితే రోజులు ఎప్పుడూ ఒకేవిధంగా ఉండవు కదా ఆమెకు ప్రస్తుతం బాలీవుడ్ లో ఎలాంటి సినీ అవకాశాలు రావడం లేదు. కరోనా దెబ్బకు సినిమా ఇండస్ట్రీ అష్ట కష్టాలు పడుతోంది. చాలా మంది కళాకారుల పరిస్థితి దారుణంగా ఉంది.  ప్రస్తుతం అలాంటి పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఆమె ప్రస్తుతం తన పాత ఇంట్లోనే అష్టకష్టాలు పడుతూ జీవిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆర్థికం గా చాలా కష్టాల ను ఎదుర్కొంటుందట. ఆమెకి వచ్చి న పాపులారిటీ కాలగర్భంలో కలిసి పోయింది.  మరి కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో బాలీవుడ్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న నేపథ్యంలో ఆమెకు మళ్లీ అవకాశాలు వస్తాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: