టాలీవుడ్ లో చాలా మంది దర్శకులు తొలి సినిమా అవకాశం కోసం ఎన్నో రోజులు వెయిట్ చేస్తారు. ఆ విధంగా తొలి సినిమా అవకాశం రాగానే హిట్ కొట్టి స్టార్ దర్శకుడిగా తొలి సినిమాతోనే అవతరించిన దర్శకులు ఎంతో మంది ఉన్నారు. అయితే అలా వచ్చిన స్టార్ డమ్ ను ఈ దర్శకులు నిలబెట్టుకుని రెండో సినిమాను కూడా చేయడం ముఖ్యం. ఎంతోమంది దర్శకులు ఈ ద్వితీయ విజ్ఞాన్ని దాటుకొని వచ్చి స్టార్ దర్శకులుగా ఎదిగారు. అయితే ఇంకొంతమంది ద్వితీయ విఘ్నం దాటలేక అక్కడే ఆగిపోయారు.

అయితే తొలి సినిమా అవకాశం వచ్చినంత ఈజీగా కొంతమంది రెండో సినిమా అవకాశం రాదు వచ్చిన సినిమా సెట్స్ పైకి ఎక్కడానికి చాలా సమయం తీసుకుంటుంది. ఆ విధంగా అజయ్ భూపతి ఆర్ఎక్స్100 సినిమా తో సూపర్ హిట్ కొట్టిన కూడా మహా సముద్రం సినిమా తెరకెక్కించడానికి సంవత్సరాల టైం తసుకున్నాడు ఇప్పుడు ఈ సినిమా పూర్తి చేసుకుంది. ఆ విధంగా రెండో సినిమా కోసం కొంతమంది దర్శకులు టాలీవుడ్లో ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఓపెన్ ద సినిమాతో తొలి సినిమాతోనే స్టార్ డైరెక్టర్ గా ఎదిగిన బుచ్చిబాబు తన రెండవ సినిమాను ఇప్పటికీ అనౌన్స్ చేయలేదు. 

స్టార్ హీరో కోసం ఆయన పడిగాపులు కాస్తున్నారు అని తెలుస్తుంది. ఇకపోతే కెమెరా మ్యాన్ నుంచి దర్శకుడిగా మారాడు కార్తీక్ ఘట్టమనేని. ఆమె దర్శకత్వంలో నిఖిల్ హీరోగా సూర్య వర్సెస్ సూర్య సినిమా రాధా ఈ సినిమా తర్వాత ఆయన రెండో సినిమాను ఇప్పటివరకు ప్రకటించలేదు. ఇక ఫలక్ నుమదాస్ చిత్రంతో తొలిసారిగా దర్శకుడిగా పరిచయం అయ్యాడు హీరో విశ్వక్ సేన్.  అయితే వరుసగా హీరోగా సినిమాలు చేస్తున్నాడు కానీ దర్శకుడిగా తన తదుపరి చిత్రం ఏంటో ఇప్పుడు వరకు వెల్లడించలేదు. మరి భవిష్యత్తులో వీరు తమ రెండవ సినిమా ప్రకటనను ఎప్పుడు చెబుతారో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: