లోకనాయకుడు కమల్ హాసన్ తమిళ సినిమాలతో బాలనటుడిగా పరిచయం అయ్యి, ఆ తర్వాత హీరోగా మారాడు. హీరోగా మారిన తర్వాత కేవలం కమర్షియల్ సినిమాలు మాత్రమే కాకుండా నటనకు ప్రాధాన్యం ఉండే కథలను మాత్రమే ఎంచుకుని అలాంటి సినిమాలను చేస్తూ తన కంటూ ఒక ప్రాముఖ్యతను తెచ్చుకున్నాడు. కేవలం తమిళ ఇండస్ట్రీ మాత్రమే కాకుండా అన్ని భాషల్లోనూ తన మార్కెట్ను పెంచుకున్న ఈ హీరో. మరిముఖ్యంగా తెలుగులో స్టార్ హీరోల రేంజ్ లో క్రేజ్ ని సంపాదించుకున్నాడు.


 కమల్ హాసన్ చేయని పాత్ర లేదేమో అనే విధంగా అనేక పాత్రలో కనిపించాడు. తమిళ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో 'ఇండియన్ టు' సినిమాతో కనిపిస్తాడు అనుకున్నా లోకనాయకుడు ఈ సినిమా ఆగిపోవడంతో కొంచెం స్లో అయ్యాడనే చెప్పవచ్చు .కానీ తమిళంలో ప్రసారం అవుతున్న 'బిగ్ బాస్' షో ద్వారా మాత్రం బుల్లితెర వీక్షకులకు దగ్గరగానే ఉన్నాడు. ప్రస్తుతం ఈ హీరో 'విక్రమ్' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను మాస్టర్ సినిమా విజయంతో మంచి ఫామ్ లో ఉన్న లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో లోకనాయకుడు అందుడి పాత్రలో కనిపిస్తాడు అని వార్తలు వస్తున్నాయి. అయితే ఇలాంటి పాత్రను కమల్ హాసన్ 1981 లో విడుదలైన 'రాజపార్వై' సినిమాలో చేశాడు. 30 సంవత్సరాల తర్వాత అలాంటి పాత్ర చేస్తున్నాడు అని వార్తలు రావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి.


 ఈ సినిమాలో కమల్ హాసన్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో సగ భాగం వరకు  అంధుడి పాత్రలో కనిపిస్తాడు అని కూడా ఫిల్మి జనం అంటున్నారు. ఇందులో లో విజయ్ సేతుపతి ,ఫాహద్‌ ఫాజిల్‌ లు కూడా అ ప్రముఖ పాత్రలో కనిపించబోతున్నాడు తెలుస్తుంది. ఈ సినిమాతో లోకనాయకుడు హిట్ ని అందుకుంటాడు లేదో తెలియాలంటే మరి కొంత కాలం ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: