టాలీవుడ్
పరిశ్రమ ఇప్పుడిప్పుడే షూటింగ్ లు మొదలై మళ్ళీ కళకళలాడుతుంది. పెద్ద సినిమాలు చిన్న సినిమాలు అనే తేడా లేకుండా అన్ని సినిమాలు సెట్స్ పైకి వెళ్లి ప్రేక్షకులను కనువిందు చేస్తున్నాయి.
సినిమా షూటింగ్ లు అయితే అవుతున్నాయి కానీ విడుదల మాత్రం కాకపోవడంతో ఈ సినిమాపు అన్నీ ఎప్పుడు విడుదల అవుతాయి అనే ప్రశ్నను వెల్ల బరుస్తున్నారు. థియేటర్లకు ప్రత్యామ్నాయంగా ఓ టీ టీ సంస్థలు రావడంతో ఎవరికీ పెద్దగా ఇబ్బంది లేకున్నా కూడా థియేటర్లలో మాత్రమే సినిమాలు చూసి ఆనందపడే వారికి మాత్రం ఇది కొంతవరకు ఇబ్బంది పడే విషయము.
ప్రస్తుతం
టాలీవుడ్ లో అన్ని పెద్ద సినిమాలు షూటింగ్ లు జరుపుకుంటూ ఉన్నాయి.
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న
ఆర్ఆర్ఆర్ సినిమా లోని పాట చిత్రీకరణ చేస్తుండగా ఈ పాటకోసం రాజమౌళి తో పనిచేసిన హీరోలందరూ కనిపించడం విశేషం.
సమంత ప్రధాన పాత్రలో
గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం శాకుంతలం చిత్రీకరణ కూడా హైదరాబాదులో జరుగుతోంది. ఈ
సినిమా సెట్స్ లో
అల్లు అర్జున్ కూతురు
అల్లు అర్హ కూడా చేరబోతోంది. సారథి స్టూడియోలో ఈ
సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
ప్రభాస్
పూజా హెగ్డే జంటగా నటించిన దృశ్యం
సినిమా జూలై 23 నుంచి ఆగస్టు 5 వరకు హైదరాబాదులో షూటింగ్ జరుపుకోనుంది. ఈ సినిమాకు సంబంధించిన కీలక సీన్ ను రామోజీ ఫిలిం సిటీలోనీ భారీ సెట్లో చిత్రీకరణ చేస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య షూటింగ్ కూడా మొదలు కానుంది. ఇప్పటికే ఈ చిత్రం చిత్రీకరణ చివరి దశకు చేరుకోగా ఈ షెడ్యూల్ తో
సినిమా షూటింగ్ కంప్లీట్ చేస్తారట.
అల్లు అర్జున్ పుష్ప, మహేష్ బాబు సర్కారు వారి పాట,
విజయ్ దేవరకొండ లైగర్,
రవితేజ రామారావు ఆన్ డ్యూటీ సినిమాలు షూటింగ్ లు మొదలు పెట్టుకో బోతుండగా ఈ
సినిమా విడుదలలు మాత్రం ఇంకా కన్ఫర్మ్ కాలేదు.