రౌడీ హీరో విజయ్ దేవరకొండ, కన్నడ భామ రష్మిక మందన్న ఇద్దరు కలిసి నటించిన సినిమా డియర్ కామ్రేడ్. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాను నూతన దర్శకుడు భరత్ కమ్మ డైరెక్ట్ చేశారు. విజయ్ దేవరకొండ, రష్మిక ఇద్దరి జోడీ ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. అయితే సినిమా ఫలితం మాత్రం ఆశించిన స్థాయిలో అందుకోలేదు. విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ సినిమా రిలీజై నేటితో రెండేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సినిమా జ్ఞాపకాల్లో విజయ్ దేవరకొండ తన సోషల్ మీడియాలో కామెంట్ పెట్టాడు. మేము ఇవ్వాల్సింది ఇచ్చాం అంటూ విజయ్ దేవరకొండ కామెంట్ పెట్టాడు.

స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన డియర్ కామ్రేడ్ సినిమాలో విజయ్ దేవరకొండ డ్యాషింగ్ లుక్ తో కనిపించారు. ఇక రష్మిక మందన కూడా స్పోర్ట్ ఉమెన్ గా మెప్పించింది. సినిమాలో విజయ్ దేవరకొండ, రష్మికల జోడీ ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేసింది. అయితే సినిమా అంచనాలను అందుకోకపోవడంతో కమర్షియల్ గా వర్క్ అవుట్ కాలేదు. సినిమా కమర్షియల్ గా సక్సెస్ కాకపోయినా సరే కొన్ని సీన్స్, మ్యూజిక్ గురించ్ డియర్ కామ్రేడ్ ఆడియెన్స్ మనసుల్లో స్థానం సంపాదించుకుంది.

ఇక ప్రస్తుతం విజయ్ దేవరకొండ పూరీ జగన్నాథ్ డైరక్షన్ లో లైగర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో విజయ్ సరసన బాలీవుడ్ అందాల భామ అనన్యా పాండే హీరోయిన్ గా నటిస్తుంది. విజయ్ దేవరకొండ, రష్మిక మళ్లీ నటిస్తే చూడాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. త్వరలోనే మళ్లీ ఈ జోడీ అలరించే అవకాశాలు ఉన్నట్టు టాక్. సినిమా చేయకపోయినా విజయ్ దేవరకొండ, రష్మికలు ఇద్దరు బయట పార్టీల్లో కలుస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ఇద్దరు కాంబోలో మరో సినిమా ప్రయత్నాల్లో ఉన్నట్టు టాక్. అయితే ఈసారి కచ్చితంగా హిట్టు సినిమా కథతో రావాలని వారు భావిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: