పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా వస్తోందంటే చాలు ఆయన అభిమానులే కాకుండా సాధారణ ప్రేక్షకులు కూడా కళ్ల కాయలు కాసేలా ఎదురు చూస్తూ ఉంటారు. అంతలా ఆయన తన నటనతో అభిమానులను మెస్మరైజ్ చేశారు. ఆయన సినిమా వస్తోందంటే చాలు అభిమానులు చేసే హడావుడి మామూలుగా ఉండదు. ఆయన వకీల్ సాబ్ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చినపుడు అభిమానులు పండుగ చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన సెట్స్ మీద రెండు షూటింగ్ లకు అటెండ్ అవుతున్నారు. ఆయన ప్రస్తుతం ఒక భారీ మల్టీ స్టారర్ ను దగ్గుబాటి రానాతో కలిసి చేస్తున్నారు. ఇది మాత్రమే కాకుండా విలక్షణ చిత్రాల దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో మరో పీరియాడికల్ మూవీని చేస్తున్నట్లు సమాచారం. ఇక రానాతో కలిసి నటించే సినిమాలో ఆయన పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో నటిస్తున్నాడు.



కాగా ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఓ విషయం బయటికొచ్చింది. మొదట అందరూ పుకారు అనుకున్నా... ప్రస్తుతం మూవీ టీం అధికారికంగా కన్ఫర్మ్ చేసింది. ఇంతకీ ఆ మ్యాటర్ ఏంటంటే ఇన్నాళ్లు పవర్ స్టార్ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా చేసిన మూరెళ్ల ప్రసాద్ ప్రస్తుతం ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. ఇక అతని స్థానంలో భరత్ అనే నేను లాంటి ఇండస్ర్టీ హిట్ మూవీకి సినిమాటోగ్రాఫర్ గా పని చేసిన రవి.కె.చంద్రన్ ను తీసుకున్నారు.


మ‌ల‌యాళంలో సూపర్ హిట్ గా నిలిచిన అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్‌ అనే చిత్రానికి ప్రస్తుతం పవన్ , రానా కలిసి చేస్తున్న సినిమా రిమేక్ అనే విషయం అందరికీ తెలిసిందే. ఈ మూవీని సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ భారీ మ‌ల్టీస్టార‌ర్ సినిమాను సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మించడం విశేషం. ఇక ఇందులో ప్రముఖ దర్శకుడు వీ.వీ వినాయక్ కూడా కనిపిస్తారని టాక్ నడుస్తోంది. ఒరిజినల్ మూవీలో డైరెక్టర్ తో చేయించిన రోల్ ను ఇక్కడ కూడా స్టార్ డైరెక్టర్ వీ.వీ. వినాయక్ తో చేయించడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: