కరోనా సెకండ్ వేవ్ ప్రభంజనంతో లాక్ డౌన్ పేరిట దేశంలో థియేటర్లు మూసి వేయగా... వైరస్ వ్యాప్తి కాస్త తగ్గుముఖం పట్టడంతో ఇటీవలే కేంద్రం లాక్ డౌన్ లో  సడలింపులు ఇస్తూ థియేటర్లు కూడా కరోనా నిబంధనలతో ఓపెన్ చేసుకోవచ్చని అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా నిన్న థియేటర్లలో విలక్షణ యువ నటుడు సత్యదేవ్ నటించిన తిమ్మరుసు మూవీ రిలీజ్ అయి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటున్న ఈ చిత్రంలో సత్యదేవ్ నటనకు ప్రేక్షకులు నీరాజనాలు పలుకుతున్నారు. తిమ్మరుసు యాక్షన్ వేరే లెవల్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ఇదిలా ఉండగా....హీరో సత్య దేవ్ కు సంబందించిన మరో తాజా వార్త సెన్సేషనల్ గా మారింది. పవర్ స్టార్ తో సత్యదేవ్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు అంటూ వార్తలు దుమారం రేపుతున్నాయి. వివరాల్లోకి వెళితే పవన్ మహా భక్తుడు బండ్ల గణేష్  పవర్ స్టార్ అనుగ్రహిస్తే దేవర అనే సినిమాను తీస్తానని సోషల్ మీడియా వేదికగా పవర్ స్టార్ ఫ్యాన్స్ కు చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఈ మాటకు బీజం పడిందని పవన్ ఈ చిత్రానికి ఒప్పుకోవడం  కథ సిద్ధం అవడం జరిగిపోయాయనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అయితే ఇప్పుడు తాజాగా ఈ సినిమాలో టాలెంటెడ్ నటుడు సత్య దేవ్ ఒక కీలక పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం..
ఈ మూవీలో ఓ కీ రోల్ కోసం సత్య దేవ్ ను సంప్రదించగా పవన్ సినిమా కావడంతో ఏమీ ఆలోచించకుండా  వెంటనే ఒప్పేసుకున్నారట సత్య దేవ్. ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ గా మారి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. మరి ఇందులో ఎంత వాస్తవముందో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం బండ్ల గణేష్ నిర్మాణంలో పవన్ దేవర సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు మరి పవర్ స్టార్ ఎప్పుడు కరుణిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: