ముంబైలో `ఆర్‌ఆర్‌ఆర్‌` ప్రీ రిలీజ్‌ వేడుక ఘనంగా జరిగిందని తెలుస్తుంది.దర్శకుడు రాజమౌళితో పాటు హీరోలు ఎన్టీఆర్‌ మరియు రాంచరణ్‌, మ్యూజిక్ డైరెక్టర్ యం.యం.కీరవాణి, హీరోయిన్లు అలియా భట్‌, శ్రియా వంటి వారు ఈ వేడుకలో పాల్గొన్నారని తెలుస్తుంది..వీరితో పాటు 'ఆర్.ఆర్.ఆర్' హిందీ వర్షెన్‌ ప్రజెంటర్‌ అయిన స్టార్ ప్రొడ్యూసర్ కరణ్‌ జోహార్‌ ఈ వేడుకకి అక్కడి స్టార్ హీరో సల్మాన్‌ ఖాన్‌ ను ముఖ్య అతిథిగా తీసుకొచ్చాడని సమాచారం.

ఈ వేడుకకి 'ఆర్.ఆర్.ఆర్' హీరోల ఎంట్రీ ప్రధాన ఆకర్షణగా నిలిచిందని చెప్పవచ్చు.

వీళ్ళని సింహాసనం పై నుండీ దింపి అభిమానులకు పూనకాలు తెప్పించాడట రాజమౌళి. బాలీవుడ్ ప్రేక్షకులు కూడా అసూయ పడేలా ఈ వేడుక అక్కడ అంగరంగ వైభవంగా జరిగిందని తెలుస్తుంది.అయితే ఒకానొక క్రమంలో ఎన్టీఆర్ అభిమానులు హద్దులు మీరి రచ్చ చేశారని తెలుస్తుంది.. బారికేడ్లు మరియు గోడల పైకి ఎక్కుతూ బాగా ఎన్టీఆర్ పేరుతో గట్టిగా అరవడం మొదలుపెట్టారని తెలుస్తుంది..నిర్మాత కరణ్ జోహార్ కిందికి దిగమని వారిని రిక్వెస్ట్ చేసినా వినలేదని సమాచారం.దాంతో కరణ్ కాస్త అసహనానికి గురయ్యాడని తెలుస్తుంది.

 

'ఎన్టీఆర్ అభిమానుల్ని ఎవ్వరూ ఆపలేరు' అంటూ ఓ మాట వదిలేసాడని సమాచారం.. దీనికి ఎన్టీఆర్ వెంటనే రియాక్ట్ అయ్యి 'దయచేసి అందరూ క్రిందకి దిగాలని క్రిందకి దిగి ఎంజాయ్ చెయ్యాలని ఇది ఏమాత్రం పద్దతిగా లేదని చెప్పుకొచ్చాడట.రాష్ట్రం కాని రాష్ట్రం వచ్చాము మన గురించి అందరూ మంచిగా మాట్లాడుకోవాలి' అంటూ గంభీరంగా వార్ణింగ్ ఇచ్చాడట.ఎన్టీఆర్ ఇలా రియాక్ట్ అవ్వడంతో అతని ప్రశంసలు కురుస్తున్నాయని తెలుస్తుంది.దీనికి సంబంధించిన వీడియో కూడా పెద్ద ఎత్తున వైరల్ అవుతుందని సమాచారం అందింది.

ఇక 'ఆర్.ఆర్.ఆర్' చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుందని అందరికి తెలిసిందే.. మూడున్నరేళ్ళుగా ఈ చిత్రం కోసం ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారని తెలుస్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: