ఇటీవలే పెళ్లితో ఒక్కటయ్యారు బాలీవుడ్ స్టార్లు విక్కీ కౌశల్, కత్రినాకైఫ్. డిసెంబర్ 9 2021వ తేదీన వీరి వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. ఇక పెళ్లి తర్వాత వీరిద్దరూ సినిమాల్లో ఫుల్ బిజీ అయిపోయారు. ఇకపోతే ఇటీవల పెళ్లితో ఒకటైన ఈ జంట ఇక ఇప్పుడు సినిమాల్లో కూడా జంటగా నటించటానికి సిద్ధమవుతున్నట్లు బాలీవుడ్లో ఒక టాక్ చక్కర్లు కొడుతుంది. ఇప్పటికే వీరిద్దరికి కథ వినిపించగా ఇక సినిమాలో జంటగా నటించటానికి ఒప్పుకున్నారు అంటూ ఒక పుకారు షికారు చేస్తోంది. ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో 'జీ లే జర' అనే సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా, కత్రినా కైఫ్, ఆలియా భట్ కీలక పాత్రలో నటిస్తూ ఉండటం గమనార్హం.
అయితే ఈ సినిమాలో కత్రినా కైఫ్ కు జోడిగా రియల్ లైఫ్ భర్త విక్కీ కౌశల్ నటిస్తే బాగుంటుందని అటు దర్శక నిర్మాతలు భావిస్తున్నారట. ఇక అనుకున్నదే తడవుగా ఈ పాత్ర విషయంపై చిత్ర బృందం విక్కీ కౌశల్ ను సంప్రదించగా ఓకే చెప్పినట్లు టాక్ వినిపిస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే పెళ్లి తర్వాత విక్కీ కౌశల్ కత్రినాకైఫ్ కలిసి నటించిన మొదటి సినిమా ఇదే అవుతుంది అన్నది తెలుస్తుంది. ఇకపోతే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన మాత్రం రావాల్సి ఉంది. అయితే ఈ పుకారు నిజం కావాలని అటు అభిమానులు అందరూ కోరుకుంటూ ఉండడం గమనార్హం.