స్టార్ హీరోయిన్ అవ్వాలంటే మొదటి రెండు సినిమాలు ఎలా పడ్డా ఆ తర్వాత స్టార్ హీరోల దృష్టిలో పడాల్సిందే. అలా పడాలంటే ముందు స్టార్ డైరక్టర్స్ ని ఆకట్టుకోవాల్సిందే. తాము రాసుకున్న కథానాయిక పాత్రకు ఆమె పర్ఫెక్ట్.. లేదా ఈ హీరోయిన్ ఉంటే సినిమాకు ప్లస్ అవుతుందని అంచనా వేసి డైరక్టర్ హీరోయిన్స్ ని ఫిక్స్ చేస్తాడు. అలా అప్పుడే స్టార్ కేటగిరిలోకి వచ్చిన పూజా హెగ్దేని ఎన్.టి.ఆర్ అరవింద సమేత కోసం సెలెక్ట్ చేశాడు త్రివిక్రం. ఆ సినిమా లో ఆమె పాత్ర పేరునే టైటిల్ గా పెట్టి సినిమా హిట్ కొట్టారు.

ఇక ఆ హిట్ కాంబో రిపీట్ చేస్తూ అల్లు అర్జున్ తో అల వైకుంఠపురములో సినిమా తీశాడు త్రివిక్రం. సినిమాలో మేడం ని ఓ రేంజ్ లో చూపించాడు దర్శకుడు. అరవింద సమేత హిట్ కాగా అల వైకుంఠపురములో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఆ హిట్ తో త్రివిక్రం, పూజా హెగ్దే కాంబో సంథింగ్ స్పెషల్ గా మారింది. అందుకే త్రివిక్రం నెక్స్ట్ చేస్తున్న మహేష్ సినిమా కు పూజా హెగ్దేని హీరోయిన్ గా సెలెక్ట్ చేశారట. త్రివిక్రం డైరక్షన్ లో బుట్ట బొమ్మ మరోసారి మెరిసిపోవడం ఖాయమని అంటున్నారు ఆడియెన్స్.

ఇప్పటికే ప్రభాస్ తో పీరియాడికల్ మూవీ రాధే శ్యాం చేస్తున్న పూజా హెగ్దే ఆచార్యలో కూడా చరణ్ సరసన నటించింది. ఇవే కాకుండ కోలీవుడ్ లో దళపతి విజయ్ తో బీస్ట్.. బాలీవుడ్ లో రణ్ వీర్ సింగ్ తో సర్కస్ సినిమాలు చేస్తుంది అమ్మడు. పూజా హెగ్దే సినిమాలో ఉంటే గ్లామర్ విషయంలో ఆలోచించాల్సిన అవసరం ఉండదు. అమ్మడు చేసే గ్లామర్ షో కుర్రాళ్లకి కావాల్సిన మజా ఇస్తుంది. అందుకే పూజా హెగ్దే కోసం దర్శక నిర్మాతలు వెంట పడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: