ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానుల నిరీక్షణకు ఇప్పుడు ఫుల్ స్టాప్ పడింది. ఎన్నో రోజులుగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సూపర్ స్టార్ మహేష్ అభిమానుల నిరీక్షణ ఫలించింది. ఎట్టకేలకు సూపర్ స్టార్ మహేష్ - నందమూరి బలకృష్ణ ల ఫైనల్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది.ఇక వెండితెరపై పదునైన డైనమేట్ లాంటి డైలాగ్ లతో ప్రత్యర్థుల గుండెల్లో బాగా వణుకు పుట్టిస్తుంటాడు నందమూరి నటసింహం బాలకృష్ణ. ఆయన మొదటి సారి హోస్ట్ గా మారి `ఆహా` ఓటీటీ కోసం `అన్ స్టాపబుల్ విత్ ఎన్ బికె`టాక్ షోని అయన చేస్తున్నారు.ఈ షోలోకి అతిధులుగా ఎంట్రీ ఇచ్చిన వారిని తనదైన స్టైల్లో ప్రశ్నిస్తూ బాల కృష్ణ ఓ ఆట ఆడుకుంటున్నారు. గెస్ట్ లు కూడా సరదాగా బాల కృష్ణతో కలిసి సందడి చేస్తున్నారు. దీంతో ఈ షో టాప్ రేటింగ్ లో రికార్డు సృష్టించడం జరిగింది. ఇక ఐఎండీబీలో ఈ షో 9.8 రేటింగ్ సాధించి టాక్ షోల్లో సరికొత్త రికార్డుని నమోదు చేసుకుని వార్తలంలో నిలిచింది.

గత కొన్ని వారాలుగా విజయవంతంగా సాగుతున్న ఈ టాక్ షో సీజన్ చివరి దశకు చేరింది.ఈ సీజన్ ఫైనల్ ఎపిసోడ్ త్వరలో స్ట్రీమింగ్ అవ్వబోతుంది. అయితే ఈ ఎపిసోడ్ లో సూపర్ స్టార్ మహేష్ అతిధిగా రాబోతున్నారు. దీనికి సంబంధించిన ప్రమోషనల్ పోస్టర్ ని గతంలోనే మేకర్స్ విడుదల చేసి ప్రకటించారు కానీ ఇంత వరకు ఈ ఎపిసోడ్ ని రివీల్ చేయకపోవడంతో సూపర్ స్టార్ అభిమానులు ఎప్పుడెప్పుడు ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవుతుందా అని చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే దీనిపై సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున చర్చ కూడా జరిగింది. అయితే ఇప్పటికి సూపర్ స్టార్ మహేష్ అభిమానుల నిరీక్షణ ఫలించింది.తాజాగా ఈ ఫైనల్ ఎపిసోడ్ ప్రసారం అయ్యే తేదీని `ఆహా` నిర్వాహకులు ప్రకటించడం జరిగింది. ఫైనల్ ఎపిసోడ్ కావడం మహేష్ మొదటి సారి బాలయ్యతో కలిసి సందడి చేయబోతుండటంతో ఈ ఎపిసోడ్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: