స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా గీతా ఆర్ట్స్, హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ అలవైకుంఠపురములో. పూజా హెగ్డే హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమా 2020 సంక్రాంతి కానుకగా రిలీజ్ అయింది. పీఎస్ వినోద్ ఫోటోగ్రఫి అందించిన ఈ సినిమాకి ఎస్ థమన్ సంగీతం అందించగా టబు, సచిన్ ఖేడేకర్, మురళి శర్మ, జయరాం, వెన్నెల కిషోర్ తదితరులు ఇతర పాత్రలు చేసారు. మంచి యాక్షన్ తో కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఆడియన్స్ ని ఆకట్టుకోవడంతో పాటు ఇందులోని సాంగ్స్ జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కించుకున్నాయి.
దానితో హీరోగా అల్లు అర్జున్ కి ఎంతో క్రేజ్ లభించింది. మరోవైపు ఈ మూవీ సాంగ్స్ యూట్యూబ్ లో వందల మిలియన్ వ్యూస్ అందుకోవడం విశేషం. అయితే అసలు మ్యాటర్ ఏమిటంటే ఈ సినిమాని ఇటీవల షెజాదా పేరుతో హిందీలో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. భూషణ్ కుమార్, అమన్ గిల్ తో కలిసి అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి రోహిత్ ధావన్ దర్శకుడు. కార్తీక్ ఆర్యన్ హీరోగా రూపొందుతున్న ఈ సినిమాలో కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తోంది. త్వరలో ఈ సినిమా పూర్తి చేసి రిలీజ్ కి సిద్ధం చేస్తున్న సమయంలో అలవైకుంఠపురములో హిందీ డబ్బింగ్ రైట్స్ సొంతం చేసుకున్న గోల్డ్ మైన్స్ సంస్థ వారు సినిమాని డబ్ చేసి రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.

అయితే అదే జరిగితే ఎంతో ఖర్చు పెట్టి తీస్తున్న రీమేక్ వర్షన్ కి నష్టం తప్పదని భావించిన నిర్మాత అల్లు అరవింద్ నేడు హుటాహుటిన ముంబై వెళ్లి గోల్డ్ మైన్స్ సంస్థ నిర్మాతలని సంప్రదించి అల హిందీ డబ్ వర్షన్ రిలీజ్ ని ఆపు చేయించారు. కాగా కొద్దిసేపటి  క్రితం దీనికి సంబంధించి అధికారికంగా ప్రకటన రిలీజ్ చేసారు. కాగా అల హిందీ డబ్బింగ్ వర్షన్ కోసం అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి ఇది ఒకింత ఇది ఇబ్బంది కరమైన న్యూస్ అయినప్పటికీ త్వరలో రీమేక్ సినిమా షెజాదా తప్పకుండా వారిని ఆకట్టుకుంటుందని మేకర్స్ అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: