అక్కినేని హీరోల సినిమాలతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నిధి అగర్వాల్ పూరీ జగన్నాథ్ డైరక్షన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో కెరియర్ లో ఫస్ట్ హిట్ అందుకుంది. ఇస్మార్ట్ హిట్ తో కెరియర్ జోష్ పెంచుకున్న అమ్మడు లేటెస్ట్ గా గల్లా అశోక్ హీరోగా వచ్చిన హీరో సినిమా తో మెప్పించింది. ఆ సినిమాలో నిధి స్పెషల్ ఎట్రాక్షన్ అంటే నమ్మాల్సిందే. అయితే సోషల్ మీడియా లో చాలా యాక్టివ్ గా ఉండే నిధి అగర్వాల్ ఎప్పటికప్పుడు తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ ని ఎట్రాక్ట్ చేసేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంది అమ్మడు.

లేటెస్ట్ గా నిధి టాలీవుడ్ స్టార్ హీరోలని ఇమిటేట్ చేస్తూ క్రేజీ వీడియో ఒకటి తన ట్విట్టర్ లో షేర్ చేసింది. చాయ్ కప్ వారు నిధి అగర్వాల్ తో ఈ వీడియో చేయించినట్టు తెల్సుతుంది. మెగాస్టార్ చిరంజీవి ఇంద్ర సినిమా మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా అన్న డైలాగ్ నుండి ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ గణేష్ అంటూ వెంకటేష్ డైలాగ్ తో సహా చెప్పి బాలకృష్ణ ట్రబుల్ ట్రబుల్స్ ద ట్రబుల్ డైలాగ్.. ఆది అమ్మతోడు అడ్డంగా నరికేస్తా అంటూ చెప్పి.. పవర్ స్టార్ గబ్బర్ సింగ్ డైలాగ్ తో అలరించింది.

ఎలాగైనా సరే తెలుగు లో స్టార్ హీరోయిన్ అవ్వాలని గట్టిగా ఫిక్స్ అయినట్టు ఉంది అందుకే నిధి అగర్వాల్ తెలుగు స్టార్స్ అందరిని ఇమిటేట్ చేస్తూ ఓ స్పెషల్ వీడియో చేసింది. ప్రస్తుతం నిధి చేసిన ఈ ఇమిటేషన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తమ అభిమాన హీరో డైలాగ్ నిధి అగర్వాల్ నోట విన్న స్టార్ హీరోల ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. తప్పకుండా నిధి టాలీవుడ్ లో దుమ్ముదులిపేయడం ఖాయమని ఫిక్స్ అవ్వొచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: