సూపర్ స్టార్ మహేష్ తో తొలిసారిగా కీర్తి సురేష్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా సర్కారు వారి పాట. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని 14 రీల్స్ ప్లస్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, మైత్రి మూవీ మేకర్ సంస్థలు ఎంతో గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తుండగా సముద్రఖని, జగపతి బాబు, సుబ్బరాజు, వెన్నెల కిషోర్ తదితరులు ఇతర పాత్రలు చేస్తున్నారు. గీత గోవిందం దర్శకుడు పరశురామ్ పెట్ల తీస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే చాలా వరకు పూర్తి అయింది.

ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ కి అందరి నుండి సూపర్ గా రెస్పాన్స్ రావడంతో పాటు సినిమాపై అందరిలో విపరీతంగా అంచనాలు ఏర్పరిచింది. ఇక ఫిబ్రవరి 14న మూవీ నుండి ఫస్ట్ సాంగ్ ని రిలీజ్ చేస్తున్నట్లు యూనిట్ ప్రకటించింది. అయితే విషయం ఏమిటంటే, ప్రస్తుతం తన లేటెస్ట్ సినిమా గుడ్ లక్ సఖి మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తన సినిమాల గురించి కీర్తి సురేష్ మాట్లాడారు. ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ గురించి మాట్లాడుతూ, మహేష్ బంగారం లాంటి మనిషని, సెట్ లో లైట్ బాయ్ దగ్గరి నుండి డైరెక్టర్ వరకు ప్రతి ఒక్కరిని ఎంతో సాదరంగా పలకరించడంతో పాటు ఎంతో పెద్ద క్రేజ్ ఉన్న సూపర్ స్టార్ అయినప్పటికీ కూడా అంతలా ఒదిగి ఉండడం చూస్తే తనకు ఆశ్చర్యం వేసిందని అన్నారు.

ఇక సర్కారు వారి పాట టీజర్ లో పలికిన డైలాగ్ ప్రకారం నిజంగానే మహేష్ గారు కెమెరా ప్రతి యాంగిల్ లో ఎంతో అంధంగా ఉంటారని, అందుకే నమ్రత గారిని దిష్టి తీయమని చెప్పినట్లు సరదాగా చెప్పారు కీర్తి. ఆ విధంగా మహేష్ గారి వంటి సూపర్ యాక్టర్ తో వర్క్ చేస్తున్న సర్కారు వారి పాట తప్పకుండా పెద్ద సక్సెస్ అవుతుందనే ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేసారు. కాగా ఈ మూవీ ఏప్రిల్ 1న వరల్డ్ వైడ్ గా ప్రేక్షకాభిమానులు ముందుకు రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: