కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ప్రస్తుతం వంశీ పైడిపల్లి డైరెక్షన్లో ఒక సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రం విజయ్ కెరీర్ లోనే 66 వ చిత్రం. ఈ సినిమా ని తెలుగులోను డైరెక్ట్ గా విడుదల చేయబోతున్నారు. ఇందులో కథానాయికగా రష్మిక నటిస్తున్నది. ఇందులో మరొక నటుడు శరత్ కుమార్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే గడచిన రెండు రోజుల క్రితం ఇందులో మరొక నటుడు ఒక ముఖ్యమైన పాత్ర లో నటిస్తున్నట్లు చిత్ర బృందం తెలియజేసింది.

ఇది అతనెవరో కాదు హిరో శ్యామ్. ఈ చిత్రంలో భాగం అవుతున్నట్లుగా మేకర్ తెలియజేయడం జరిగింది. టాలీవుడ్ లో కి కిక్ చిత్రం తో పోలీస్ ఆఫీసర్ గా బాగా అలరించారు శ్యామ్. ఆ తరువాత అదే తరహాలో ఊసరవెల్లి, రేసుగుర్రం, kick-2, వీర, తదితర చిత్రాల్లో నటించారు ఈయన. పలు చిత్రాలలో చాలా బిజీగా ఉన్న శ్యామ్ ఇప్పుడు ఇంకా పేరుకు నోచుకోని ఒక సినిమాలో  విజయ్ కి బ్రదర్ గా కనిపించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇక 2000 సంవత్సరంలో వచ్చిన ఖుషి సినిమాలో వీరిద్దరూ కలిసి నటించారు. అయితే ఇప్పుడు సరిగ్గా 22 ఏళ్ల తర్వాత మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు స్టార్ హీరోస్.

శ్రీ వెంకటేశ్వర బ్యానర్ పై దిల్ రాజ్-సిరీస్ ఈ చిత్రాన్ని అత్యధిక బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సంగీత దర్శకుడు s.s తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్ళిన సంగతి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కూడా చాలా వేగంగా జరుగుతున్నది. ఈ చిత్రం 2023లో విడుదలయ్యేందుకు ఎక్కువగా అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. కేవలం డబ్బింగ్ సినిమాలతోనే తెలుగులో మంచి మార్కెట్ సంపాదించుకున్న విజయ్.. అక్కడ కూడా వీరు అభిమానులను సంపాదించుకున్నాడు విజయ్.

మరింత సమాచారం తెలుసుకోండి: