యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తీయనున్న లేటెస్ట్ మూవీ అతి త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ సరసన ఒక స్టార్ నటి హీరోయిన్ గా నటించనున్న ఈ సినిమాపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరిలో కూడా భారీ స్థాయిలో అంచనాలు నెలకొని ఉన్నాయి. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధా ఆర్ట్స్ సంస్థలపై ఎంతో భారీ వ్యయంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మితం కానున్న ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కనుండగా యువ సంగీత దర్శకుడు అనిరుద్ రవిచందర్ దీనికి స్వరాలు సమకూర్చనున్నట్లు టాక్.

మరోవైపు ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ అవ్వగా, రెండు రోజుల క్రితం ప్రత్యేకంగా ఎన్టీఆర్ పై ఒక స్పెషల్ ఫోటో షూట్ కూడా నిర్వహించిందట యూనిట్. ఎన్టీఆర్ ఇమేజ్ ని మరింతగా పెంచేలా భారీ యాక్షన్ తో కూడిన మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ మూవీ తెరకెక్కనుందని, తామిద్దరి కాంబినేషన్ లో గతంలో వచ్చిన జనతా గ్యారేజ్ ని మించేలా మరింత అద్భుతంగా కొరటాల శివమూవీ తీయనున్నారని టాక్. ఇప్పటికే ఆల్మోస్ట్ స్క్రిప్ట్ వర్క్ మొత్తం పూర్తి అయిన ఈ మూవీ లాంఛనంగా మే 20న ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా ప్రారంభం కానున్నట్లు టాక్.

ఇటీవల చిరు, చరణ్ లతో తీసిన ఆచార్య తో పెద్ద డిజాస్టర్ చవి చూసిన కొరటాల శివ, ఎలాగైనా ఈ సినిమా సక్సెస్ కొట్టాలని మరింతగా హార్డ్ వర్క్ చేస్తున్నట్లు చెప్తున్నారు. తమ టీమ్ అంతా కూడా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా స్క్రిప్ట్ పై వర్క్ చేసారని, అలానే సినిమా కోసం పలు సెటింగ్స్ ని భారీ స్థాయిలో రూపొందిస్తున్నారని, త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ మూవీ వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ కానుందని సమాచారం. మొత్తంగా దీనిని బట్టి చూస్తుంటే ఆచార్య తో ఢీలా పడ్డ కొరటాల, ఎన్టీఆర్ మూవీతో పెద్ద హిట్ కొట్టేలా ఉన్నారుగా అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు.

మరింత సమాచారం తెలుసుకోండి: