టాలీవుడ్ యువ హీరో నితిన్ గత కొన్ని సినిమాలుగా ఫ్లాప్ లతో సతమతమవుతున్నారు. తన సెకండ్ ఇన్నింగ్స్ లో మంచి మంచి సినిమాలను ఎంపిక చేసుకుంటున్న ఈ హీరో మధ్య లో కొంత తడబడుతున్నాడు. భీష్మ సినిమా తో విజయం సాధించిన తర్వాత నితిన్ రెండు సినిమాలు చేయగా అవి ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించాలేకపోయాయి. దాంతో ఇప్పుడు నితిన్ చేయబోయే సినిమా పై పెద్ద ఒత్తిడి నెలకొంది. ఎంతో ఇష్టపడి చేసిన చెక్ సినిమా మినిమం వసూళ్లు కూడా రాబట్టలేకపోయింది. వెరైటీ సినిమాగా మిగిలిపోయింది కానీ నితిన్ కి మాత్రం భారీ ఫ్లాప్ ను తెచ్చిపెట్టింది.

ఆ తర్వాత రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన రంగ్ దే సినిమా కూడా పూర్తి స్థాయి లో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దాంతో వరుసగా రెండు ఫ్లాప్ లు చూడవలసి వచ్చింది నితిన్. అందుకే కాబోలు ఇప్పుడు ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ఓ నూతన దర్శకుడితో కలిసి ఆయన మాచర్ల నియోజక వర్గం అనే పొలిటికల్ థ్రిల్లర్ నేపథ్యంలోని సినిమా చేస్తున్నాడు. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా విడుదల త్వరలోనే జరగనుంది. ఈ సినిమా రెగ్యులర్ సినిమాలా కాకుండా ఎంతో బాగుంటుందని నితిన్ అభిమానులు చెబుతున్నారు. ఈనేపథ్యంలో ఈ సినిమా ఆయనకు హిట్ తెచ్చిపెడుతుందా అనేది చూడాలి.

ఇక నితిన్ హీరో గా నటిస్తున్న మరో సినిమా వక్కంతం వంశీ దర్శకత్వంలోని సినిమా. రచయితగా ఎన్నో హిట్ సినిమాలకు పనిచేసిన వక్కంతం నా పేరు సూర్య సినిమా తో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత నితిన్ తో అయన సినిమా చేస్తుండడం విశేషం. వెరైటీ సినిమా గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ ను మొదలుపెట్టుకుంది. ఇకపోతే ఈ రెండు సినిమాలే కాకుండా నితిన్ మరిన్ని సినిమాలు కూడా చేసే విధంగా ప్లాన్ చేశాడు. కొంతమంది యువ దర్శకుల కథలను అయన ఒకే చేసినట్లు సమాచారం. ఏకంగా ఆయన మరో రెండు సినిమాలను చేసే విధంగా ప్లాన్స్ చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: