మెగాస్టార్ చిరంజీవి గారి జడ్జిమెంట్ కు ఇండస్ట్రీలో ఎంతో గౌరవం ఉంటుంది. ఆయన ఊరికే ఓ కథని ఓకె చేయరు.. ఊరికే ఓ కథకి నో చెప్పరు అని అప్పట్లో అంతా కూడా అనుకునే వారు.


99 శాతం ఇదే నిజమయ్యేది కూడా..! కానీ కొంచెం ట్రెండ్ మారిన తర్వాత ఆయన జడ్జిమెంట్ కు తగినట్లు ఫలితాలు అయితే దక్కడం లేదు. ఉదాహరణకి చిరు విషయంలో మనం 3 సందర్భాలు చెప్పుకోవచ్చు.


 


1) 'జై చిరంజీవ' సినిమా టైంకి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్.. కె.విజయ్ భాస్కర్ గారి దగ్గర పనిచేయడం మానేసాడట.. అప్పటికి వాళ్ళ మధ్య ఏం గ్యాప్ వచ్చిందో కూడా ఎవ్వరికీ తెలీదు. ఆ సినిమా టైంకి త్రివిక్రమ్ 'నువ్వే నువ్వే' 'అతడు' సినిమాలకి దర్శకత్వం వహించి రెండు హిట్లు కూడా కొట్టేసాడు. కానీ చిరు కావాలని త్రివిక్రమ్ ను 'జై చిరంజీవ' ప్రాజెక్టులో ఇరికించారట.అయిష్టంగానే ఆ సినిమాకి పనిచేశాడట త్రివిక్రమ్. అందుకే ఆ సినిమాలో కామెడీ అయితే క్లిక్ అయ్యింది కానీ కథ మాత్రం క్లిక్ అవ్వలేదు. ఫలితం ఆ సినిమా ప్లాప్.


 


2) అలాగే చరణ్ నటించిన 'బ్రూస్ లీ' చిత్రానికి కూడా అదే విధంగా చేశాడట.. ఈ చిత్రం టైంకి శ్రీను వైట్ల దగ్గర పనిచేసే గోపి మోహన్, కోన వెంకట్ లు సెపరేట్ అయిపోయారట.కానీ 'బ్రూస్ లీ' కోసమని మళ్ళీ శ్రీను వైట్ల వద్ద రైటర్స్ గా చేశారు. కట్ చేస్తే ఈ సినిమా కూడా అట్టర్ ప్లాప్ అయ్యింది. ఇక్కడ కూడా చిరు బలవంతం వల్లనే కోన వెంకట్, గోపి మోహన్ లు పనిచేసారట.


 


3) ఇటీవల వచ్చిన 'ఆచార్య' విషయంలో కూడా ఇలాగే జరిగినట్లు తెలుస్తుంది.కొరటాల శివకి దేవి శ్రీ ప్రసాద్ మాత్రమే మ్యూజిక్ డైరెక్టర్ గా ఉండాలి. కానీ మణిశర్మని తీసుకొచ్చి తగిలించాడట చిరు.మణిశర్మ తో కొరటాల శివకి అస్సలు పడలేదు. చివరికి మణిశర్మ కొడుకు మహతి వచ్చి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా చేశాడు. అదీ అతికీఅతకనట్టు అయ్యిందట.. అలాగే స్క్రిప్ట్ విషయంలో కూడా చిరు వేలు పెట్టడం బాగా ఎక్కువైంది. అందుకే దీని ఫలితం కూడా బెడిసి కొట్టింది.



మరింత సమాచారం తెలుసుకోండి: