తెలుగు సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇక ఈయన బాలనటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి .. తనదైన శైలిలో యువరాజు గా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఆ తర్వాత తన నటనతో ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా ప్రస్తుతం సూపర్ స్టార్ గా చలామణి అవుతూ ఉన్నారు. ఇక మొన్నమధ్య సరిలేరు నీకెవ్వరు సినిమాతో బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న మహేష్ బాబు ఇటీవల పరశురాం డైరెక్షన్లో సర్కారు వారి పాట సినిమాతో మరొక విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఇప్పుడు ఇంకొకసారి త్రివిక్రమ్ తో జతకట్టడానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పనులు మొదలు కావాల్సి ఉండగా కొన్ని అనివార్య కారణాల వల్ల సినిమా షూటింగ్ ఆగిపోయింది.

ఇక ఈ సినిమా తర్వాత భారీ ఆఫ్రికన్ అడవుల్లో యాక్షన్ ఎంటర్టైన్మెంట్ మూవీగా తెరకెక్కించబోయే మరొక సినిమాలో నటిస్తున్నాడు. ఇక దీనికి రచయితగా విజయేంద్రప్రసాద్ పనిచేస్తుండగా.. డైరెక్టర్ రాజమౌళి ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఇకపోతే ఇప్పుడు చెప్పబోయే విషయం తెలిస్తే అటు అభిమానులతో పాటు ఇటు సినీ తారలు కూడా షాకవ్వాల్సిందే .. ఒకేసారి ఏకంగా ఐదుగురు డైరెక్టర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి జాక్పాట్ కొట్టారు మహేష్ బాబు. ఇక రాజమౌళితో సినిమా తర్వాత ప్రముఖ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు మహేష్ బాబు.

ఇక సుకుమార్ తో సినిమా కంప్లీట్ అయిన తర్వాత అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తో ఒక డిఫరెంట్ మూవీ చేయాలని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది ఇక బిజినెస్ మాన్ , పోకిరి వంటి సినిమాలతో మంచి విజయాన్ని అందించిన పూరి జగన్నాథ్ తో కూడా మరొకసారి సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు మహేష్ బాబు. అయితే ఈ మాస్ డైరెక్టర్ తో ఈయన సినిమా చేయడానికి ఒప్పుకోవడంతో అభిమానులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలా వరుసగా ఐదు మంది డైరెక్టర్లను మహేష్ బాబు లాక్ చేసి అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: