టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తాజాగా మీనా భర్త మృతి తెలిసి ప్రతి ఒక్కరు తీవ్ర సంతాపం తెలుపుతున్నారు. అయితే ఈమె భర్త చనిపోవడానికి పక్షులు కారణమని ఒక మీడియా సందేహం వ్యక్తం చేస్తోంది.. ఇక మీనా భర్త విద్యాసాగర్ మృతికి ,పక్షులకు గల సంబంధం ఏమిటి అనే విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఇకపోతే కోలీవుడ్ మీడియాలో కధనం ప్రకారం మీనా భర్త మృతికి పావురాలు నుంచి సోకిన ఇన్ఫెక్షన్ కారణమని తమిళ మీడియా కోడైకూస్తోంది . వీరి ఇంటికి సమీపంలో చాలా పావురాలు ఉన్నాయట. ఇక ఇంటికి సమీపంలోనే చాలా పావురాలు ఉండడంతో వాటి నుంచి వచ్చే వ్యర్థాలు కలిసిన గాలి పీలుస్తుండడం వల్ల ఇంట్లో అందరికీ ఇలా ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్స్ అయింది అని ఆ మీడియాలో వార్తలు వెలువడ్డాయి.

ఇక మీనా భర్త మృతి చెందినడానికి కారణం ఒకవైపు పావురాలు అంటుంటే..మరొక వైపు  కరోనా కారణంగా వచ్చిన ఇన్ఫెక్షన్లు కూడా ఒక రకంగా కారణమని చెబుతున్నారు. ఇకపోతే విద్యాసాగర్ ఆరోగ్యం విషమించి నప్పుడు ఆయనకు ఊపిరితిత్తులు ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలని వైద్యులు తెలిపారు అట. కానీ అందుకోసం బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి లభిస్తే ఆపరేషన్ చేయాలని భావించారు.. ఇక దేవుడు తన వికృతి రూపాన్ని చూపించడంతో జూన్ 28వ తేదీన రాత్రి విద్యాసాగర్ తిరిగి రాని లోపాలకు వెళ్లిపోయారు. ఇక ఈయన మరణవార్త విని ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతూ.. ఆయన మృతికి తీవ్ర సంతాపం తెలియజేస్తున్నారు.

మీనా భర్త హఠాన్మరణంతో సినీ పరిశ్రమ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనైంది. ఇక ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. ఇకపోతే ఈరోజు సాయంత్రం విద్యాసాగర్ అంతక్రియలు చెన్నైలో జరుగుతున్నట్లు సమాచారం. 2009లో బెంగళూరుకి చెందిన వ్యాపారవేత్త అయిన విద్యాసాగర్ ను మీనా వివాహం చేసుకుంది . ఇక వీరికి నైనిక అనే పాప కూడా ఉంది. ఈ పాప కూడా పలు సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: