దీంతో బాలీవుడ్ దర్శక, నిర్మాతలు తమ సినిమాలకు సంగీతం అందించాలని కోరడం ప్రారంభించారు. బీ టౌన్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కు కూడా రాక్ స్టార్ ట్యూన్స్ ఎంతగానో నచ్చాయి. అందువల్ల తాను నటిస్తున్న 'కీసీ కా బాయ్, కీసీ కా జాన్' కు సంగీతం అందించాలని కోరాడు. ఈ సినిమాకు పూర్తిగా దేవినే సంగీతం అందించనున్నాడని గతంలో వార్తలు వచ్చాయి. కానీ, అభిప్రాయ భేదాలతో రాక్స్టార్ తప్పుకొన్నట్టు పుకార్లు షికార్లు కొట్టాయి. ఈ వదంతులపై దేవి శ్రీ ప్రసాద్ స్పందించాడు. ప్రస్తుతం అనేక మంది కంపోజర్స్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు.
కీసీ కా బాయ్, కీసీ కీ జాన్' లో అన్ని పాటలకు మ్యూజిక్ అందించాలని తనను ఎవరు కోరలేదని దేవి శ్రీ ప్రసాద్ తెలిపాడు. ''నన్ను సంప్రదించే సమయానికే చిత్ర బృందం దగ్గర కొన్ని పాటలు ఉన్నాయి. కానీ, ఫర్హద్ సామ్జీ పూర్తిగా స్క్రిఫ్ట్ను వినిపించి పాటలను అందించాలన్నాడు. కథను వినిపించేటప్పుడు సినిమాలో అనేక పాటలకు చోటు ఉంది. రన్టైమ్ పెరుగుతుండటంతో పాటల సంఖ్యను తగ్గించారు. అదే విషయాన్నే నాకు కూడా చెప్పారు. సల్మాన్ కోసం ఓ క్రేజీ పాటను కంపోజ్ చేశాను. అది అభిమానులకు నచ్చుతుంది'' అని దేవి శ్రీ ప్రసాద్ చెప్పాడు. ప్రస్తుతం ఈ సినిమాకు అనేక మంది మ్యూజిక్ కంపోజర్స్పనిచేస్తున్నారు. 'కెజియఫ్' ఫేం రవి బస్రూర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ను అందిస్తున్నాడు. ఈ చిత్రం కమర్షియల్ ఎంటర్ టైనర్గా ఉండాలని సల్మాన్ భావిస్తున్నాడట. అందువల్ల ఏ అంశంలోను రాజీ పడటం లేదని తెలుస్తోంది. 'కిసీ కా బాయ్, కిసీ కా జాన్' లో తెలుగు నటులు వెంకటేశ్, రామ్ చరణ్ కూడా నటిస్తున్నారు. పూజా హెగ్డే ఓ కీలక పాత్రను పోషిస్తుంది. ఈ మూవీ క్రిస్మస్ కానుకగా థియేటర్స్లో విడుదల కానుంది. ఇక దేవి శ్రీ ప్రసాద్ విషయానికి వస్తే.. హిందీ 'దృశ్యం-2' కు సంగీతం అందిస్తున్నాడు. రోహిత్ శెట్టి 'సర్కస్' కు మ్యూజిక్ కంపోజర్గా పనిచేస్తున్నాడు. 'పుష్ప-2', 'బవాల్', 'సూర్య-42' వంటిప్రాజెక్టులు రాక్స్టార్ చేతిలో ఉన్నాయి.