గత కొన్ని రోజుల నుంచి భారతీయ సినిమా పరిశ్రమలో ఎక్కడ చూసినా కాంతార మేనియా కనిపిస్తుంది అని చెప్పాలి. రిషబ్ శెట్టి దర్శకత్వంలో ఆయనే స్వయంగా హీరోగా నటించిన కాంతారా సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. చిన్న సినిమాగా విడుదలై ఇక ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో సెన్సేషన్స్ సృష్టించింది అని చెప్పాలి. కేవలం 18 కోట్లతో తెరకెక్కిన  ఈ సినిమా ఏకంగా 200 కోట్ల వరకు వసూళ్లు సాధించే దిశగా దూసుకుపోతోంది. ఇక ఈ సినిమాలోని కాన్సెప్ట్, ఈ సినిమాలో రిషబ్ శెట్టి నటన ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది అని చెప్పాలి.


 ఇక నిజ జీవిత కథ ఆధారంగానే  ఈ సినిమా తెరకెక్కించినట్లు నటుడు దర్శకుడు రిషబ్ శెట్టి తెలిపాడు అన్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ పై ఎంతో సంతోషంగా ఉన్నాను అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఈ సినిమాలో రిషబ్ శెట్టి పాత్ర ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇక ఆ పాత్రలో అతను ఒదిగిపోయిన తీరు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తుంది అని చెప్పాలి. ఇక ఈ సినిమా చూసిన తర్వాత కాంతారా సినిమాలో రిషబ్ శెట్టి పాత్రలో ఎవరు నటించినా అతనిలా పాత్రకు ప్రాణం పోసే వారు కాదేమో అని అనిపిస్తూ ఉంటుంది. కానీ కాంతార సినిమాలో ముందుగా రిషబ్ శెట్టి హీరోగా చేయాలని అనుకోలేదట.


 ముందుగా కన్నడ సూపర్ స్టార్ దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ కోసం ఈ కథను సిద్ధం చేశారట రిషబ్ శెట్టి. కానీ పునీత్ రాజ్ కుమార్ గత ఏడాది ఆకస్మిక గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పునీత్ రాజ్ కుమార్ లేకపోవడంతో ఇక ఆ పాత్రలో మరొకరు సెట్ కారు అని భావించి ఇక ఆ స్టోరీ రాసుకున్న తానైతేనే పాత్రకు న్యాయం చేస్తానని అనుకున్నాడట రిషబ్ శెట్టి. ఈ క్రమంలోనే ఇక తానే హీరోగా నటించినట్లు వెల్లడించాడు. ఈ విషయం తెలిసిన అభిమానులు కాంతార సినిమాలో పునీత్ రాజ్కుమార్ నటించి ఉంటే మరో లెవల్ లో ఉండేది అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: