తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ కృష్ణ మరణం తర్వాత ఎన్నో విషయాలు బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా అభిమానులకు ప్రేక్షకులకు తెలియని ఎన్నో విషయాలు ఒక్కొక్కటిగా సినిమా వాళ్లు బయట పెడుతూ కృష్ణ గొప్పదనం గురించి తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోని కృష్ణ రెమ్యునరేషన్ ఎంత తీసుకునేవారు.. అనేదానిపై నిర్మాత నట్టి కుమార్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. నట్టి కుమార్ మాట్లాడుతూ.. కృష్ణ కేవలం రూ. 25 లక్షలు మాత్రమే తీసుకున్నారని తెలిపారు.


అయితే కృష్ణ గారిపై అభిమానంతోనే చాలామంది నిర్మాతలు రూ.50 లక్షల కు అటు ఇటుగా పారితోషకం ఇచ్చారు.  కానీ నిర్మాతల నుంచి ఆయన అడిగి తీసుకున్న రెమ్యునరేషన్ కేవలం రూ.25  లక్షలు మాత్రమేనని తెలిపారు . హీరోగా సినిమాలలో నటించిన సమయంలో ఆయన తీసుకున్న హైయెస్ట్ రెమ్యునరేషన్ కేవలం రూ.15 లక్షలు మాత్రమే అని నట్టి కుమార్ వెల్లడించారు. కృష్ణ , విజయనిర్మల మధ్య మంచి అటాచ్మెంట్ ఉండేదని వివరించిన ఆయన .. విజయనిర్మల మరణం తర్వాత ఒంటరి వారయ్యారు.  కొడుకు రమేష్ మరణం ఆయనను మరింత దిగ్బ్రాంతికి గురిచేసింది.


ఆ ఇద్దరు ఉండి ఉంటే మరికొన్ని సంవత్సరాల పాటు కృష్ణ జీవించేవారు. ఏసుప్రభువు రోల్ లో నటించాలని కృష్ణ గారికి కోరిక.  ఒక సినిమాలో ఆ రోల్ నటించడం ద్వారా తన కోరికను నెరవేర్చుకున్నారని తెలిపారు. కృష్ణ తన సినీ కెరియర్ లో ఎన్నో ప్రయోగాలు చేశారు అంటూ నట్టి కుమార్ చెప్పుకొచ్చారు. ఇకపోతే రోజుకు 18 గంటల పాటు కృష్ణ పని చేసిన సందర్భాలు కూడా ఉన్నాయని ఆయన తెలిపారు. ఇలా ఎన్నో అరుదైన రికార్డులు , అవార్డులు సొంతం చేసుకున్న కృష్ణ ఊహించని విధంగా అకస్మాత్తుగా మరణించడం అందరికీ బాధ కలిగిస్తోంది. మొత్తానికైతే కృష్ణలేని లోటు ప్రతి ఒక్కరికి స్పష్టంగా కనిపిస్తోందని చెప్పాలి. అయితే ఈ బాధల నుంచి మహేష్ బాబు త్వరగా కోలుకోవాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: