తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలో ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు త్రిష . టాలీవుడ్ ఇండస్ట్రీలో చెన్నై ముద్దుగుమ్మగా అడుగుపెట్టి మరింత పాపులారిటీని సంపాదించుకుంది . ఇదిలా ఉండగా ముచ్చటగా మూడోసారి భారీ ఛాన్స్ కొట్టేసింది ఈ ముద్దుగుమ్మ. ఇప్పటికే మన్మథన్ అంబు, తూంగవనం వంటి చిత్రాలలో కమలహాసన్ కు జోడిగా నటించిన ఈమె ఇప్పుడు ముచ్చటగా మూడోసారి కమలహాసన్ తో జతకట్టడానికి సిద్ధమయ్యింది. ఇదిలా ఉండగా కమలహాసన్, త్రిష కాంబినేషన్లో వచ్చిన ఈ రెండు సినిమాలు కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో హ్యాట్రిక్ ఫిలిం రాబోతోందని తెలిసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

1987 లో నాయకుడు సినిమా తర్వాత కమలహాసన్,  విలక్షణ దర్శకుడు మణిరత్నం కాంబినేషన్లో ఇప్పుడు ఒక సినిమా రాబోతున్న విషయం తెలిసిందే.  ఇటీవల ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు.  ఇందులో త్రిష హీరోయిన్ గా నటించనున్నట్లు కోలీవుడ్లో ప్రచారం జరుగుతుంది. ఇటీవల త్రిష ప్రధాన పాత్రలో నటించిన రాంగీ సినిమా కూడా విడుదల అయింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో కమలహాసన్,  మణిరత్నంతో మళ్ళీ సినిమా చేయాలని ఉందంటూ ఆమె చెప్పడంతో ఇప్పుడు ఇన్ డైరెక్ట్ గా కమల్ , మణిరత్నం సినిమాలో హీరోయిన్గా నటించనున్నట్లు వార్తలు వైరల్ అయ్యాయి.


కానీ ఇప్పుడు ఇదే విషయంపై..  కమలహాసన్ 234వ చిత్రంలో త్రిష జతకట్టనుంది అని అధికారికంగా వెలువడింది. ఇప్పటికే మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియన్ సెల్వన్ -1 సినిమాలో చోళ యువరాణి కుందవై పాత్రలో నటించిన ఈమె ఇందులో తన నటనతో,  అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్లో కూడా నటిస్తోందని సమాచారం. ఈ సినిమా సీక్వెల్ పూర్తయిన వెంటనే మణిరత్నం,  కమలహాసన్ తో సినిమాను తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది.. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కానుంది అని సమాచారం.మద్రాస్ టాకీస్,  రెడ్ జైంట్స్ సంస్థలు నిర్మిస్తున్న ఈ సినిమాను కమలహాసన్ కూడా నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: