మెగాస్టార్ చిరంజీవి తాజాగా వాల్తేరు వీరయ్య అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. శృతి హాసన్ ఈ సినిమాలో చిరంజీవి సరసన హీరోయిన్గా నటించగా ,  బాబీ సింహ , ప్రకాష్ రాజ్మూవీ లో విలన్ పాత్రలలో నటించారు. రవితేజ ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో నటించగా , కేథరిన్ ఈ సినిమాలో రవితేజ కు భార్య పాత్రలో నటించింది. శ్రీనివాస్ రెడ్డి , షకలక శంకర్మూవీ లో నటించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ మూవీvని మైత్రి సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మించింది.

ఈ సినిమాను ఈ సంవత్సరం జనవరి 13 వ తేదీన భారీ ఎత్తున ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేశారు. ఈ మూవీ విడుదలకు ముందు నుండి ఈ సినిమా నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు , పాటలు , ట్రైలర్ అద్భుతంగా ఉండడం , అలాగే చాలా సంవత్సరాల తర్వాత చిరంజీవి ... రవితేజ కలిసి ఈ సినిమాలో నటిస్తూ ఉండడంతో ఈ మూవీ పై భారీ అంచనాలు ప్రేక్షకుల్లో నెలకొన్నాయి. దానితో ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 88 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

అలా భారీ ఫ్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకున్న ఈ సినిమా 89 కోట్ల భారీ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ టాక్ రావడంతో ఈ సినిమాకు బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ కలెక్షన్లు లభిస్తున్నాయి. ఇప్పటివరకు 7 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా 7  రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 91.41 కోట్ల షేర్ ... 157.15 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసి హిట్ స్టేటస్ ను అందుకొని 2.41 కోట్ల లాభాలను కూడా అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: