టాలీవుడ్ స్టార్ హీరో బాలయ్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ కార్యక్రమం పేరుకు తగ్గట్లుగానే బ్రేకుల్లేకుండా దూసుకుపోతుంది అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే మొదటి సీజన్ సూపర్ హిట్ కాగా అటు రెండవ సీజన్ అంతకు మించిన విజయాన్ని సాధిస్తుంది. ఎంతోమంది స్టార్ హీరోలను పిలిచి బాలయ్య వేస్తున్న చిలిపి ప్రశ్నలు అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉన్నాయని చెప్పాలి. మొన్నటికి మొన్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఎపిసోడ్ రికార్డు రేటింగ్స్ సొంతం చేసుకోగా.. ఇటీవలే పవర్ స్టార్ ఎపిసోడ్ ఆ రికార్డులన్నింటినీ కూడా మరోసారి బద్దలు కొట్టింది.


 అయితే ఇలా యువ హీరోలతో పాటు స్టార్ హీరోలు అందరిని కూడా బాలయ్య తన కార్యక్రమానికి పిలుస్తున్నాడు. కొంతమంది రాజకీయ నాయకులను కూడా పిలిచారు.  కానీ ఇప్పటివరకు ఏ నందమూరి హీరో అటు అన్ స్టాపబుల్ కార్యక్రమంలో కనిపించలేదు అని చెప్పాలి. ఇప్పటికే రెండవ సీజన్ ముగింపు దశకు చేరుకున్న నందమూరి హీరో బాలయ్య షో లో కనిపిస్తాడు అన్న ఆశ అభిమానులకు తీరలేదు. అయితే నందమూరి వారసులు అయినప్పటికీ ఇక ఈ షోకి రాకపోవడానికి కళ్యాణ్ రామ్ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. మీరు ఎందుకు మీ బాబాయి అన్ స్టాపబుల్ షోలో పాల్గొనలేదు అంటూ యాంకర్ ప్రశ్నించగా.. మీరు ఈ ప్రశ్నని ఆహా వారిని అడిగితే బాగుంటుంది అంటూ సమాధానం చెప్పాడు. దీన్ని బట్టి చూస్తే ఆహా నుండి ఆహ్వానం లేకపోవడంతోనే ఇక నందమూరి హీరోలు అన్ స్టాపబుల్ కు వెళ్లలేదు అన్నది తెలుస్తుంది.


 ఇక దీని బట్టి చూస్తే మూడవ సీజన్లో నందమూరి హీరోలు అన్ స్టాపబుల్ కార్యక్రమంలో కనిపించే ఛాన్స్ ఉన్నట్లు టాక్ వినిపిస్తుంది. అంతేకాదు మీ నుండి పిలుపు రావాలి కానీ వచ్చేస్తాను అంటూ ప్రభాస్ ఎపిసోడ్ లో రామ్ చరణ్ కూడా చెప్పడంతో.. ఇక మూడో సీజన్ లో రామ్ చరణ్ ని కూడా పిలిచే ఛాన్స్ ఉందట. మరి మెగాస్టార్ ఈ కార్యక్రమానికి వస్తాడా లేదా అన్న దానిపై మాత్రం  ఆసక్తికర చర్చ జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: