
ఇప్పటివరకు విడుదలైన చిత్రాలలో పవన్ కళ్యాణ్ నటించిన ఖుషి చిత్రం రూ.1.65 కోట్ల రూపాయల కలెక్షన్లను నైజాం ఏరియాలో సంపాదించింది. ఈ చిత్రమే మొదటి స్థానంలో ఉన్నది. ఇక తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన జల్సా సినిమా రూ.1.26 కోట్ల రూపాయల కలెక్షన్లను రాబట్టింది.. ఆ తర్వాత లిస్టులో మహేష్ బాబు నటించిన ఒక్కడు సినిమా.. రూ.90 లక్షలు రాబట్టింది. ఇక రాంచరణ్ నటించిన ఆరంజ్ చిత్రం నిన్నటి రోజున విడుదల చేయగా రూ.75 లక్షల రూపాయలను రాబట్టింది. అలాగే మహేష్ నటించిన పోకిరి సినిమా రూ.69 లక్షల రూపాయలను రాబట్టింది ఇదంతా కేవలం నైజాం ఏరియాలోని రాబట్టినట్లు తెలుస్తోంది
ఇక ఇవే కాకుండా చాలామంది హీరోలు సైతం రీ రిలీజ్ సినిమాలను విడుదల చేయడం జరిగింది కానీ అవన్నీ ఏవి పెద్దగా సక్సెస్ కాలేకపోయినట్లు తెలుస్తోంది. మరి రాబోయే రోజుల్లో ఈ రిలీజ్ రెండు హవ్వ భారిగానే కొనసాగేలా కనిపిస్తోంది. ప్రస్తుతం స్టార్ హీరోలంతా తమ తమ చిత్రాల షూటింగ్ తో బిజీగా ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఎక్కువగా అందరూ పాన్ ఇండియా చిత్రాలను విడుదల చేస్తూ ఉండడం గమనార్హం. రాబోయే రోజుల్లో రీ రిలీజ్ ట్రెండింగ్ హవాలా ఏ సినిమా మారుస్తాయో చూడాలి మరి.