పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న తాజా సినిమా బ్రో.ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే.

రోజురోజుకీ ఈ సినిమాపై ఉన్న అంచనాలను మరింతకు పెంచేస్తున్నారు మూవీ మేకర్స్. ఇటీవల చిత్రం బృందం ఈ సినిమా టైటిల్ ని అనౌన్స్ చేయడంతో పాటు పవన్ కళ్యాణ్ లుక్ ని కూడా రివిల్ చేసిన సంగతి తెలిసిందే. అలాగే ఈ సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్ ని వీడియోని కూడా విడుదల చేశారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా నుంచి సాయి ధరంతేజ్ కి సంబంధించిన లుక్ ని కూడా విడుదల చేశారు.

ఈ సినిమాలో మార్కండేయులు అలియాస్ మార్క్ అనే పాత్రలో ఆయన నటిస్తున్నాడు. ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ మోషన్ పోస్టర్ కి థమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఒక రేంజ్ లో ఉందంటూ ఆడియన్స్ కామెంట్స్ కూడా చేస్తున్నారు. అయితే సినిమాలో పాటలకి సంబందించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. ఇందులో మొత్తం 5 పాటలు ఉన్నాయట. అందులో పవన్ కళ్యాణ్ పైనే రెండు పాటలు ఉండగా వాటిలో ఒకటి స్పెషల్ సాంగ్ అని సమాచారం.ఇక ఈ సాంగ్ లో పవన్ తో చిందులేసేందుకు ఇద్దరు భామల పేరులను పరిశీలిస్తున్నట్లు సమాచారం.ఒకరు బాలీవుడ్ హీరోయిన్ దిశా పటానీ,మరొకరు గబ్బర్ సింగ్ బ్యూటీ శ్రుతి హాసన్. వీరిద్దరిలో ఎవరో ఒకరిని ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం మూవీ టీం ఫైనల్ చేయనుందని సమాచారం.. సముద్రఖని డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో సాయి ధరమ్ కి జోడిగా కేతిక శర్మ నటించబోతుందని సమాచారం.. మరో అందాల భామ ప్రియా వారియర్ చెల్లి పాత్రలో కనిపించబోతుందని తెలుస్తుంది.. కాగా ఈ సినిమా జులై 28న ఆడియన్స్ ముందుకు రాబోతుందని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: