ఆల్రెడీ వీర సిం హా రెడ్డి సినిమాను నిర్మించిన మైత్రి మేకర్స్ గోపీచంద్ లోని టాలెంట్ గుర్తించి అతనితో మరో సినిమా కూడా చేస్తున్నారు. ఇక మాస్ మహరాజ్ తో గోపీచంద్ సినిమా అంటే మాస్ ఆడియన్స్ కి మరో మాస్ ఫీస్ట్ పక్కా అని ఫిక్స్ అవ్వొచ్చు. ఈ సినిమాకు సంబందించిన అనౌన్స్ మెంట్ తో ఒక ఫ్యాన్ రెక్కలు చూపిస్తూ పోస్టర్ వదిలారు చిత్ర యూనిట్. ఇక సినిమా అనౌన్స్ మెంట్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ లాంటిది జూలై 9న ఉదయం 11:11 గంటలకు రిలీజ్ చేయనున్నారు.
సూపర్ హిట్ కాంబో మూవీ అంటే సూపర్ హిట్ వైబ్ క్రియేట్ అయినట్టే. అనౌన్స్ మెంట్ తోనే సినిమాపై సూపర్ బజ్ ఏర్పడేలా చేయాలని ఫిక్స్ అయ్యారు మేకర్స్. వీర సిం హా రెడ్డి తర్వాత గోపీచంద్ రవితేజతో సినిమా చేయడం మాస్ రాజాకి కూడా కలిసి వచ్చే అంశమే. మరి ఈ క్రాక్ కాంబో ఈసారి ఆడియన్స్ కి ఎలాంటి మాస్ ఫీస్ట్ అందిస్తారన్నది చూడాలి. రవితేజ ప్రస్తుతం టైగర్ నాగేశ్వర రావు, ఈగల్ సినిమాలు చేస్తున్నాడు. ఈ సినిమాలతో పాటుగా గోపీచంద్ మలినేని సినిమా కూడా సెట్స్ మీదకు వెళ్లనుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి