తేరీ హిందీ రీమేక్తో కీర్తిసురేష్ బాలీవుడ్లోకి అరంగేట్రం చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒరిజినల్ లో సమంత చేసిన క్యారెక్టర్ను హిందీలో కీర్తిసురేష్ రీప్లేస్ చేయనుందని సమాచారం.ఈ రీమేక్లో వరుణ్ధావన్ హీరోగా నటించనున్నాడు. తేరీ మాతృకకు దర్శకత్వం వహించిన అట్లీ బాలీవుడ్ రీమేక్కు మాత్రం ప్రజెంటర్గా వ్యవహరించనున్నాడని తెలిసింది. అతడి భార్య ప్రియా అట్లీ ఈ బాలీవుడ్ మూవీని ప్రొడ్యూస్ చేయనున్నట్లు తెలిసింది. ఈ రీమేక్కు ఖలీస్ దర్శకత్వ బాధ్యతల్ని చేపట్టబోతున్నట్లు చెబుతోన్నారు. తేరీ మాతృకతో పోలిస్తే హిందీ రీమేక్లో చాలా మార్పులు చేసినట్లు సమాచారం. ఆగస్ట్ నెలలో ముంబైలో తేరీ రీమేక్ షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉందని చెబుతుంది.
వచ్చే ఏడాది మే నెలలో ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిసింది. ఇటీవలే దసరా సినిమాతో తెలుగులో, మామన్నన్ మూవీతో తమిళంలో బిగ్గెస్ట్ కమర్షియల్ సక్సెస్లను అందుకున్నది కీర్తిసురేష్. ప్రస్తుతం మూడు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. మరోవైపు వరుణ్ధావన్. సమంతతో కలిసి సిటాటెడ్ అనే సిరీస్ చేస్తోన్నాడు.ఏదేమైనా కీర్తి సురేష్ కు బాలీవుడ్ బాగా కలిసిరావాలని ఆమె అభిమానులు ఎదురు చూస్తున్నారు. అలాగే తెలుగు చిత్ర పరిశ్రంలో కూడా మరెన్నో అవకాశలు రావాలని కోరుకుంటున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి