అల్లు అర్జున్ మామగారైన కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి అధికార బీఆర్ఎస్ పార్టీ నేత గా ఉన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండగా ఆయన పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు.ఇందులో భాగంగా పెద్దవూర మండలం కొత్తగూడెం గ్రామంలో 1000 మంది కెపాసిటీతో కూడిన కన్వెన్షన్ హాల్ నిర్మించాడు. దీని ప్రారంభోత్సవానికి అల్లుడు అల్లు అర్జున్ ని ముఖ్య అతిథిగా పిలిచారు. నేడు పెద్దవూర మండలంలో జరగనున్న ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్ హాజరుకానున్నారు.బీఆర్ఎస్ మంత్రి జగదీశ్ రెడ్డి తో పాటు నల్గొండ జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి భారీగా ఈ వేడుక నిర్వహిస్తున్నారు. 10000 మందికి భోజన ఏర్పాట్లు చేయడంతో పాటు మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. నాగార్జున సాగర్ నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్న కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి పొలిటికల్ ఈవెంట్స్ లో విరివిగా పాల్గొంటున్నారు.

తన అల్లుడు అల్లు అర్జున్ కన్వెన్షన్ హాల్ ఓపెనింగ్ కి రావడం వలన భారీగా జనాలు తరలివచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ నుండి సీటు పొందే అవకాశాలు మెరుగవుతాయని ఆయన భావిస్తూ ఉండవచ్చు. ఇక గతంలో అల్లు అర్జున్ ఎలాంటి పొలిటికల్ ఈవెంట్స్ లో పాల్గొనలేదు. మొదటిసారి ఆయన బీఆర్ఎస్ నేత చంద్రశేఖర్ రెడ్డి ఏర్పాటు చేసిన ఈవెంట్ కి హాజరుకానున్నారు. చంద్రశేఖర్ రెడ్డి కుమార్తె అయిన స్నేహారెడ్డిని 2011లో అల్లు అర్జున్ ప్రేమ వివాహం చేసుకున్నారు.మరోవైపు పుష్ప 2 షూటింగ్ లో అల్లు అర్జున్ పాల్గొంటున్నారు. దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా విడుదలయ్యే అవకాశం కలదు. రష్మిక మందాన హీరోయిన్ కాగా ఫహాద్ ఫాజిల్ విలన్ రోల్ చేస్తున్నారు. దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: