థాంక్యూ మూవీతో నాగ చైతన్యకి సక్సెస్ ఇవ్వలేకపోయిన విక్రమ్ కుమార్ దూత వెబ్ సిరీస్ తో సూపర్ హిట్ ఇచ్చాడు. జర్నలిజం బ్యాక్ డ్రాప్ లో కథని తీసుకొని ప్రస్తుతం మీడియా అనేది ఎలా ఉంది. నిజాలు చెప్పాల్సిన విలేకరులే వాటిని ఎలా సమాధి చేస్తున్నారు అనే కథాంశంతో దూత సినిమాని తెరకెక్కించారు. ఎనిమిది ఎపిసోడ్స్ ఉన్న ఈ వెబ్ సిరీస్ ని ఎంతో క్యూరియాసిటీగా తీసుకెళ్లారు. చెప్పాలనుకున్న పాయింట్ ని ఎక్కడ కూడా డీవియేషన్ లేకుండా స్ట్రైట్ గా చెప్పడంతో దూత వెబ్ సిరీస్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యింది. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా సీజన్ 2 కూడా స్టార్ట్ చేసే ప్లాన్ లో ఉన్నారట మూవీ టీం. నాగ చైతన్య కూడా ఈ దూత వెబ్ సిరీస్ కొనసాగింపుపై ఎంతో ఆసక్తికరంగా ఉన్నారు.మార్చి 19 వ తేదీన దూత సీజన్ 2పై అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం ఉందని నాగ చైతన్య క్లారిటీ ఇచ్చాడు. అయితే ఈ సీజన్ 2 కోసం కథని కంప్లీట్ గా మారుస్తున్నారా లేదంటే అదే కథకి కొనసాగింపు ఇస్తారా అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.


ఇలాంటి కథలతో వెబ్ సిరీస్ లు రావడం వలన సమాజానికి ఖచ్చితంగా ఓ మంచి సందేశాన్ని ఇచ్చినట్లు ఆవుతుందని సమాచారం తెలుస్తుంది.ఇక ఇదిలా ఉంటే నాగ చైతన్య ప్రస్తుతం చందూ మొండేటి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ లో తండేల్ సినిమా చేస్తున్నాడు. పాన్ ఇండియా లెవల్ లో ఈ సినిమాని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. శ్రీకాకుళం బ్యాక్ డ్రాప్ లో ఫిషర్ మెన్ లైఫ్ లో జరిగిన రియల్ లైఫ్ సంఘటనల స్ఫూర్తితో ఈ సినిమాని తెరపై ఆవిష్కరిస్తున్నారు. గీతా ఆర్ట్స్సినిమా కథపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు.ఇక నాగ చైతన్య కూడా చాలా రోజుల తర్వాత ఒక మాస్ అప్పీల్ ఉన్న పాత్రలో పెర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న క్యారెక్టర్ చేస్తున్నాడు. సాయి పల్లవి ఈ సినిమాలో నాగ చైతన్యకి జోడీగా నటిస్తోంది. ఆమె పాత్ర కూడా ఈ మూవీలో చాలా కీలకంగా ఉండబోతోందనే సమాచారం వినిపిస్తోంది. ఇద్దరి లవ్ స్టోరీ ఎంతో ఎమోషనల్ గా ప్రేక్షకులకి కనెక్ట్ అవుతుందని సమాచారం తెలుస్తుంది. దూత 2, తండేల్ తో గట్టి హిట్లు కొట్టి టాప్ హీరోల్లో ఒకడిగా నిలిచిపోవాలని నాగ చైతన్య భావిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: