టాలీవుడ్ నటుడు అల్లరి నరేష్ ఆఖరుగా సుడిగాడు అనే ఫుల్ లెన్త్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ తో బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు. ఇక ఆ తర్వాత ఈయన ఎన్నో ఫుల్ లెన్త్ కామెడీ ఎంటర్టైనర్ సినిమాల్లో హీరోగా నటించినప్పటికీ అందులో ఏ మూవీ కూడా సుడిగాడు రేంజ్ విజయాన్ని మాత్రం అందుకోలేదు. ఇక దానితో ఈయన అనేక అపజయాలు బాక్స్ ఆఫీస్ దగ్గర రావడంతో తన రూటు ను మార్చాడు. అందులో భాగంగా నాంది అనే వైవిధ్యమైన సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ సూపర్ సక్సెస్ అయ్యింది.

అలాగే ఇందులోని నరేష్ నటనకు ప్రశంసలు దక్కాయి. దానితో ఈయన ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం , ఉగ్రం అనే వైవిధ్యమైన సినిమాలలో హీరో గా నటించాడు. కాకపోతే ఈ రెండు మూవీ లు కూడా ఈయనకు నిరాశనే మిగిల్చాయి. కొంత కాలం క్రితం ఈ నటుడు నాగార్జున హీరోగా రూపొందిన నా సామి రంగ సినిమాలో కీలకమైన పాత్రలో నటించాడు. ఈ మూవీ మంచి విజయం అందుకుంది. అల్లరి నరేష్ కి కూడా ఈ సినిమాలోని నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. ఇకపోతే చాలా సంవత్సరాల తర్వాత నరేష్ "ఆ ఒక్కటి అడక్కు" అనే ఫుల్ లెంత్ కామెడీ ఎంటర్టైనర్ సినిమాలో హీరో గా నటించాడు.

మూవీ కి మళ్లీ అంకం దర్శకత్వం వహించాడు. ఈ మూవీ మే 3 వ తేదీన థియేటర్ లలో విడుదల కానుంది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన రన్ టైమ్ ను లాక్ చేశారు. ఈ మూవీ 2 గంటల 14 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమాతో నరేష్ ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: