ప్రస్తుతం సినిమా థియేటర్లు అందులోనూ సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతపడ్డ విషయం తెలిసిందే. డైలీ మెయింటెనెన్స్ కష్టంగా మారడంతో తెలంగాణ ఎగ్జిబిటర్ల రోజులు గడవడానికి కష్టంగా మారింది.. అందుకే షేరింగ్ పద్ధతిలో సినిమాలను ఎలా ప్రదర్శించాలనే విషయంపై మంగళవారం తెలంగాణ ఎగ్జిబిటర్స్ కంట్రోలర్ అసోసియేషన్ సమావేశం అయ్యింది.. నైజాంలో సినిమాను కొన్న రేటు ప్రాతిపదికగా నెలలో నాలుగు వారాల కలెక్షన్లు ఎలా పంచుకోవాలనే విషయంపై చర్చించడం ఇక్కడ ఆసక్తికరంగా మారింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లను కాపాడేందుకు గతంలో ఉన్న పర్సంటేజ్ విధానాన్ని మళ్లీ అమల్లోకి తీసుకువచ్చారు.

నిజానికి  కొన్ని సంవత్సరాల క్రితం ఎగ్జిబిటర్లు,  డిస్ట్రిబ్యూటర్స్ మధ్య పర్సంటేజ్ పద్ధతి ఉండేది.. ఆ తర్వాత కాలంలో ఎగ్జిబిటర్లకు రెంటు మాత్రమే పే చేస్తూ వచ్చారు డిస్ట్రిబ్యూటర్లు..  దీనికి తోడు జీఎస్టీ కూడా వేయడంతో ఎగ్జిబిటర్ల కష్టాలు ఇప్పుడు మరింత పెరిగాయి. తాజాగా సినిమాల రిలీజ్లు కూడా లేకపోవడంతో ఆ నష్టాలు ఇంకా ఎక్కువై మూసేసే పరిస్థితి వచ్చింది. దీన్ని చక్కదిద్దేలా ఫిలిం ఛాంబర్ ఇప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంది .. అందుకే మరోసారి పర్సెంటేజ్ విధానాన్ని అమలులోకి తీసుకొచ్చింది..

మరి ఆ ఈ పర్సంటేజ్ విధానం ఏ విధంగా తీసుకొచ్చారు అనే విషయానీకొస్తే నైజాంలో రూ .30 కోట్లకు పైబడి హక్కులు కలిగిన సినిమాలకు మొదటి వారం డిస్ట్రిబ్యూటర్లకు 75%, ఎగ్జిబిటర్లకు 25 శాతం ఉండాలని.. అలాగే రెండో వారం 55% డిస్ట్రిబ్యూటర్లకు, 45 శాతం ఎగ్జిబిటర్లకు , ఆ తర్వాత వారాలకు 40-60, 30-70 శాతం తీసుకోవాలని నిర్ణయించారు. ఇకపోతే రూ .10 కోట్ల నుంచి రూ.30 కోట్ల రేటుకు కొన్న సినిమాలకు తొలి వారం డిస్ట్రిబ్యూటర్లకు 60% ఎగ్జిబిటర్లకు 40 శాతం లెక్కన పంపిణీ చేస్తారు . తర్వాత వారం చెరో 50%, మూడో వారం 40-60 నాలుగో వారం 30-70 లెక్కన షేర్ చేసుకుంటారు . ఇక ఈ నేపథ్యంలోనే జూన్ ఫస్ట్ నుంచి తాము తీసుకున్న నిర్ణయాలు అమలులోకి వస్తాయని కూడా ప్రకటించారు.. మొత్తానికైతే ఈ నిర్ణయంతో సింగిల్ స్క్రీన్ థియేటర్ల కష్టాలు కొంతవరకు తీరుతాయని ఇండస్ట్రీ పెద్దలు కూడా చెబుతున్నారు.. మరి ఈ పర్సంటేజ్ విధానం ఏ మేరకు అమలు అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: