పూజా హెగ్డే.. ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ బ్యూటీ.. టాప్ హీరోలకు మోస్ట్ వాంటెడ్. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. కారణం వరుస ప్లాపులు. పూజా హెగ్డే తెలుగు చిత్రాల్లో కనిపించి రెండేళ్లు పైనే అయింది. చివరిగా ఆమె తెలుగులో నటించిన `ఆచార్య`, `రాధే శ్యామ్‌` చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాయి. దాంతో ఇక్కడ అవకాశాలు తగ్గిపోయాయి. అదే సమయంలో పూజా హెగ్డే తమిళ్, హిందీ చిత్రాలపై ఫోకస్ పెట్టింది. కానీ ఆయా భాషల్లో సైతం ఆమెకు ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి.


ఇక మొత్తానికి టాలీవుడ్ లో రీఎంట్రీ ఇచ్చేందుకు పూజా హెగ్డే రెడీ అయింది. రీసెంట్ గా ఈ అమ్మడు బిగ్ ఛాన్స్ కొట్టేసిందని వార్తలు వస్తున్నాయి. ఎస్ఎల్‌వి సినిమాస్ బ్యానర్ లో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ఓ స్ట్రైట్ తెలుగు ఫిల్మ్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సుధాకర్ చెరుకూరి నిర్మించనున్న ఈ సినిమాతో ఓ కొత్త కుర్రాడు డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు. చాలా కాలం క్రితమే ఈ ప్రాజెక్టు అధికారికంగా ప్రకటించబడింది.


అయితే ఈ చిత్రంలో హీరోయిన్ గా పూజ హెగ్డేను ఎంపిక చేశారని ప్రచారం జ‌రుగుతోంది. ఇప్పటికే సంప్రదింపులు కూడా పూర్తి అయ్యాయట. ప్రస్తుతం దుల్క‌ర్ `కాంత‌`, `ఆకాశంలో ఒక తార` అనే సినిమాలు చేస్తున్నాడు. ఇవి కంప్లీట్ అయ్యాక దుల్కర్, పూజా హెగ్డే మూవీ సెట్స్ మీదకు వెళ్ళనుందని అంటున్నారు. ఇక మరోవైపు పూజా హెగ్డే చేతిలో `జన నాయగన్`, `కాంచన 4` చిత్రాలు ఉన్నాయి. త్వరలోనే `కూలీ` మూవీతో ప్రేక్షకులను పలకరించబోతోంది. అదే విధంగా హిందీలో `హై జవానీ తో ఇష్క్ హోనా హై` ఒక సినిమా కూడా చేస్తుంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: