నిన్నటి రోజున అల్లు అరవింద్ తల్లి, అల్లు రామలింగయ్య భార్య కనకరత్నమ్మ వృద్ధాప్య సమస్యలతో మరణించారు. కనకరత్నమ్మ చిరంజీవి భార్య సురేఖకు తల్లి అవుతుంది. దీంతో అటు మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీలో తీవ్ర విషాదఛాయలు నెలకొన్నాయి. అల్లు అర్జున్ తన నానమ్మ మరణించిన వార్తను జీర్ణించుకోలేకపోయారు. నిన్నటి రోజున సాయంత్రం కనకరత్నమ్మ అంత్యక్రియలను పూర్తి చేశారు. చిరంజీవికి అత్త కావడంతో అన్ని కార్యక్రమాలను దగ్గరుండి మరి చూసుకున్నారు. అంతేకాకుండా అత్తమ్మ పాడే కూడా మోశారు చిరంజీవి.



అన్ని కార్యక్రమాలు పూర్తి అయిన తర్వాత సాయంత్రం ఒక హాస్పెటల్ కార్యక్రమంలో పాల్గొన్న చిరంజీవి తన అత్తమ్మ చేసిన ఒక గొప్ప విషయాన్ని తెలియజేశారు. చిరంజీవి ఇలా మాట్లాడుతూ తాను తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో మా అత్తగారు లేరనే వార్త వచ్చింది. అల్లు అరవింద్ కూడా ఆ సందర్భంలో బెంగళూరులో ఉండడంతో తానే వెళ్లానని తెలిపారు. ఆ సమయంలోనే తాము అనుకున్న ఆర్గాన్ డొనేషన్ తమకు గుర్తుకు వచ్చిందని. అలా అందరితో మాట్లాడి ఐ డొనేషన్ కి సిద్ధం చేశాను..



ఒకానొక సమయంలో చిరంజీవి తల్లి, అత్తమ్మ మధ్య ఈ విషయం గురించి చర్చించుకున్నామని.. ఈ విషయంపై కనకరత్నమ్మ గారు కాలి బూడిద అయ్యే శరీరాన్ని చచ్చిన తర్వాత ఏం చేస్తాము.. ఇచ్చేద్దామని చెప్పారని చిరంజీవి వెల్లడించారు. బెంగళూరు నుంచి దారి మధ్యలో వస్తున్న అల్లు అరవింద్ కి కూడా ఫోన్ చేసి చెప్పానని తెలిపారు చిరంజీవి. ఈ విషయం పైన కనకరత్నమ్మ గారు (చిరంజీవి అత్త) ఎక్కడ కూడా సంతకం పెట్టలేదు. గతంలో చెప్పిన ఆ మాటే ప్రతిజ్ఞలాగా అనిపించింది. అందుకే తన అత్త కనకరత్నమ్మ కళ్ళను తీసి హాస్పిటల్ కి పంపించాను అంటూ చిరంజీవి తెలియజేశారు. అందుకు సంబంధించి కొన్ని వీడియోలను ఫోటోలను కూడా చూపించారు చిరంజీవి. ఈ విషయం తెలిసి మెగా, అల్లు అభిమానులు కూడా కనకరత్నమ్మ గారు చాలా గ్రేట్ మరణించిన కూడా ఇంకొకరికి చూపు ఇస్తోంది అంటూ ఆమెను అభినందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: