సినీ నటిగా, దర్శకురాలుగా పేరు సంపాదించింది హీరోయిన్ రేణు దేశాయ్. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మాజీ భార్యగా అందరికీ సుపరిచితమే. ప్రస్తుతం సింగిల్ మదర్ గానే లైఫ్ ను లీడ్ చేస్తోంది. ఆ మధ్య రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమాతో తన సెకండ్ నేషనల్ మొదలు పెట్టింది రేణు దేశాయ్. అనంతరం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలకు సంబంధించి అందులో పంచుకుంటూ ఉంటుంది. ముఖ్యంగా సామాజిక అంశాల పైన తరుచూ స్పందిస్తూ ఉంటుంది. అలాగే ఎన్నో రకాల సేవ కార్యక్రమాలలో కూడా పాల్గొంటుంది రేణు దేశాయ్ .


తాజాగా రేణు దేశాయ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది. భవిష్యత్తులో తన సన్యాసిగా మారే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయంటూ తెలిపింది. రేణు దేశాయ్ మాట్లాడుతూ .. టైగర్ నాగేశ్వరరావు సినిమా తర్వాత తన మీద చాలా విమర్శలు వచ్చాయని, మళ్లీ సినిమాలలోకి రీఎంట్రీ ఇచ్చింది ఎలాంటి పాత్రలోనైనా చేస్తుందా అని తనని చాలామంది విమర్శించారని తెలిపింది. అందుకే  ఇప్పటివరకు మరొక సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని తెలిపింది.


అంతేకాకుండా తనకు నటన అంటే చాలా ఇష్టం, కానీ అదే నా లక్ష్యం కాదు, నేను డబ్బుకు ప్రాధాన్యత ఇచ్చే మనిషిని కానే కాదు. ఇప్పటికీ నాకు మంచి పాత్రలు చాలానే వస్తున్నాయి త్వరలోనే అత్త పాత్రలో కనిపిస్తానని ఆ సినిమా షూటింగ్ కూడా త్వరలోనే ప్రారంభం కాబోతోందని తెలిపింది. అంతేకాకుండా  తనకు ఆధ్యాత్మిక మార్గం అంటే చాలా ఇష్టమని భవిష్యత్తులో తాను సన్యాసం తీసుకునే అవకాశం కూడా ఎక్కువగా ఉందంటూ తెలిపింది రేణు దేశాయ్. ప్రస్తుతం రేణు దేశాయ్  చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అయితే ఈ విషయం పైన అభిమానులు భిన్నాభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: