ప్రస్తుత జనరేషన్ కి షోలే సినిమా అంటే తెలియదు.. కానీ 90స్ లో పుట్టిన వారికి  షోలే మూవీ గురించి క్లియర్గా తెలిసే ఉంటుంది.. అప్పట్లో ఈ మూవీ సృష్టించిన సంచలనాలు అంతా ఇంతా కాదు.. ఎలాంటి టెక్నాలజీ, సోషల్ మీడియా లేని సమయంలోనే ఈ సినిమా అద్భుతమైన హిట్ సాధించింది.. అప్పట్లో ఈ చిత్రానికి కేవలం మూడు కోట్ల బడ్జెట్ పెడితే 35 కోట్లు సంపాదించి భారతదేశంలోనే పెద్ద ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.. అయితే ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు వస్తున్నాయి.టికెట్లు రేట్లు పెరిగి కొన్ని చిత్రాలు భారీ బడ్జెట్ సంపాదిస్తున్నాయి. కానీ ఆ సమయంలో టికెట్ల రేట్లు చాలా తక్కువ.. ఆ టైంలో కూడా 35 కోట్లు సంపాదించడం అంటే మామూలు విషయం కాదు.. అంటే ఇప్పుడు వచ్చిన బాహుబలి,పుష్ప వంటి సినిమాల కంటే ఎక్కువ సాధించినట్టు..


 అయితే ఈ షోలే చిత్రంలో ధర్మేంద్ర,అమితాబ్ బచ్చన్,హేమామాలిని,జయ బాధురీలు ప్రధాన పాత్రల్లో నటించారు.. ఇక ఈ మూవీలో విలన్ గా అంజాద్ ఖాన్ ఇరగదీసారు. 1975 రిలీజ్ అయిన ఈ చిత్రం తక్కువ బడ్జెట్ తో సూపర్ హిట్ అయింది.. ఇండియాలోనే ఆల్ టైం క్లాసిక్ మూవీ గా నిలిచిపోయింది.. ఈ చిత్రాన్ని చాలామంది రీమేక్ చేద్దామని ప్రయత్నాలు చేశారట. కానీ ఎవరితో కాలేదు.. అయితే ఈ సినిమాకు రీమేక్ గా  తెలుగు డైరెక్టర్ పూరి జగన్నాథ్ 2011లో ప్రభాస్,గోపీచంద్ లను పెట్టి చేద్దామని భావించారట. దీనికి సంబంధించిన అనేక వార్తలు కూడా బయటకు వచ్చాయి. అయితే ఈ ఇద్దరు హీరోల మధ్య మంచి స్నేహం కూడా ఉంది..

వీరిని పెట్టి సినిమా తీస్తే షోలే చిత్రంలో జై వీరుల స్నేహం ఏ విధంగా ఉందో, రీమేక్ చేసి వీరి స్నేహాన్ని కూడా ఆ విధంగానే చూపించాలనుకున్నాడట పూరి జగన్నాథ్. దీనికి సంబంధించిన వార్తలు బయటకు వచ్చినా కానీ, అధికారికంగా ఎక్కడ ప్రకటించలేదు. నిజానికి వీరి కాంబినేషన్లో సినిమా తీసి ఉంటే మాత్రం బాగానే వర్కౌట్ అయ్యేదని కొంతమంది అంటున్నారు.. పూరి జగన్నాథ్ ప్లాన్ చేసి ఉంటే బాహుబలి కంటే ముందే ప్రభాస్ ఖాతాలో పాన్ ఇండియా ప్రాజెక్టు ఉండేదేమో అంటూ  మాట్లాడుకుంటున్నారు.. కానీ పూరి జగన్నాథ్ గురించి వార్తల్లో వచ్చింది తప్ప ఆయన మాత్రం అధికారికంగా ఎక్కడ ప్రకటించలేదు.. దీంతో ఈ సినిమా ఒక వార్త గానే మిగిలిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: