పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్ పై బెల్లం సుధా రెడ్డి సమర్పణలో బెల్లం రామకృష్ణా రెడ్డి రచనా, స్వీయ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం ‘దేవగుడి’. ఈ చిత్రానికి లక్ష్మీకాంత్ కనికే డిఓపిగా పని చేస్తుండగా షేక్ మదీన్, రఘు కుంచె సంగీతాన్ని అందించారు. నాగిరెడ్డి ఎడిటింగ్ బాధ్యతలను నిర్వర్తించారు. అభినవ శౌర్య, నరసింహ, అనుశ్రీ ప్రధాన పాత్రలు పోషించగా పలువురు నటీనటులు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించారు. తాజాగా ఈ చిత్ర టీజర్‌‌ను హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో హీరో శ్రీకాంత్ చేతుల మీదుగా విడుదల చేశారు.

టీజర్ విడుదల అనంతరం హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ.. ‘‘2013లో రామకృష్ణా రెడ్డి నిర్మాతగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఎంతో ప్యాషన్‌తో ఇండస్ట్రీలోకి వచ్చిన ఆయన ఎక్కడా కాంప్రమైజ్ అవకుండా సినిమాలు నిర్మించి సక్సెస్ అయ్యారు. అప్పట్లో ఆయన సినిమా గురించి చెబుతుంటే.. మీరే డైరెక్షన్ చేయవచ్చు కదా అని అనేవాడిని. మరి నేను అప్పుడు అలా అన్నాననో, లేకపోతే.. ఫస్ట్ ఫిల్మ్ దగ్గరుండి అన్నీ అబ్జర్వ్ చేసిన తర్వాత తీసుకున్న నిర్ణయమో తెలియదు కానీ, వెంటనే డైరెక్టర్‌గా మారారు. ఆయన దర్శకత్వంలో వస్తున్న ఈ ‘దేవగుడి’ చిత్రం మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ‘దేవగుడి’ టైటిల్ చాలా బాగుంది. టీజర్ కూడా అద్భుతంగా ఉంది. ఇందులో చిత్రమ్మగారు పాడిన మెలోడీ సాంగ్ చాలా చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత ఆ సాంగ్ నా మదిని తాకింది. ఇది ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో రియల్‌గా జరిగిన స్టోరీ అని నేను అనుకుంటున్నాను. అనుకోవడం కాదు.. నాకు ఈ స్టోరీ తెలుసు. రియల్‌గా జరిగిన స్టోరీ ఇది. కచ్చితంగా అందరినీ అలరిస్తుందని నమ్ముతున్నాను. ’’ అని అన్నారు.

దర్శకనిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి మాట్లాడుతూ.. 2013లో శ్రీకాంత్‌గారితో పుష్యమి ఫిలిం మేకర్స్ శ్రీకారం చుట్టాము. శ్రీకాంత్‌గారు ఏ నోటితో అన్నారో ఆ రోజు.. ‘భయ్యా నువ్వు డైరెక్టర్ అయిపోవచ్చుగా అని’.. ఆ తర్వాత నేను డైరెక్టర్‌గా మారాను. ‘దృశ్యకావ్యం’ చేశాను. అప్పుడు కూడా ఆయన అభినందించారు. ఇప్పుడు మళ్లీ మా ‘దేవగుడి’ కోసం వచ్చారు. డిసెంబర్ 19న ‘దేవగుడి’ ఫైర్ ఉంటుంది. కచ్చితంగా హిట్ కొట్టబోతున్నాం. చాలా కాన్ఫిడెంట్‌గా చెబుతున్నాను. ఎందుకంటే, ఈ సినిమాకు టాలెంటెడ్ పర్సన్స్ ఎందరో వర్క్ చేశారు. ఆల్రెడీ ఈ సినిమాను నిపుణులు, సెన్సార్ మెంబర్స్ అందరూ చూసి.. ఎంతగానో మెచ్చుకున్నారు. కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నాను. స్క్రీన్‌ప్లే అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ’’ అని తెలిపారు.

ఇంకా ఈ కార్యక్రమంలో రఘు కుంచె, డీఓపీ లక్ష్మీకాంత్ కనికే, హీరోహీరోయిన్లు మాట్లాడుతూ.. అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెబుతూ.. సినిమాను ప్రేక్షకులు సక్సెస్ చేయాలని కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: