టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో కెరీర్ పరంగా దూసుకుపోతున్నారు. ఆయన అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ విజయాలు అందుకుంటున్నారు. తాజాగా, బాలయ్య తన తదుపరి చిత్రం కోసం సక్సెస్ఫుల్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో మరోసారి జతకట్టబోతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్లో గతంలో వచ్చిన 'వీరసింహారెడ్డి' బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిన విషయం విదితమే.
ఈ కొత్త సినిమాలో బాలయ్య సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్గా నటించనుంది. ఆమె పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇది బాలకృష్ణ, నయనతార కాంబినేషన్లో వస్తున్న నాలుగో సినిమా కావడం విశేషం. గతంలో వీరిద్దరూ కలిసి నటించిన 'సింహా', 'శ్రీరామరాజ్యం', 'జైసింహా' వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయాలు సాధించాయి.
ఈ తాజా చిత్రంలో నయనతార ఒక యువరాణి తరహా పాత్రలో కనిపించనున్నారని సమాచారం. వృద్ధి సినిమాస్ బ్యానర్ పై ఈ భారీ ప్రాజెక్ట్ తెరకెక్కుతోంది. బాలయ్య కెరీర్లోనే ఇది అత్యంత భారీ బడ్జెట్తో రూపొందుతున్న సినిమా కావడం గమనార్హం.
మరోవైపు, బాలకృష్ణ నటించిన 'అఖండ 2' చిత్రం డిసెంబర్ 5వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించాలని బాలయ్య ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. బాలయ్య పారితోషికం కూడా ప్రస్తుతం 40 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
ఈ వాట్సాప్ నెంబర్కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి