రిషబ్ శెట్టితో కలిసి ‘ జై హనుమాన్ ’ చేస్తున్నామని, ఇది కాంతారా తర్వాత ఆయన నుంచి రాబోయే తదుపరి చిత్రం అని రవిశంకర్ వెల్లడించారు. అదే సమయం లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూపొందుతున్న భారీ యాక్షన్ డ్రామా కూడా ప్రస్తుతం షూటింగ్లో ఉందని తెలిపారు. ఈ చిత్రం 2026 మార్చిలో విడుదలవు తుందని క్లారిటీ చెప్పారు. అలాగే పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ 2026 ఏప్రిల్లో విడుదల అయ్యేలా ప్లాన్ చేస్తున్నారని చెప్పారు. ఇక రెబల్ స్టార్ ప్రభాస్తో కలిసి చేస్తున్న ఫౌజీ కూడా పెద్ద స్కేల్పై రూపొందుతున్న మరో ప్రాజెక్ట్ అని పేర్కొన్నారు.
ఈ ప్రాజెక్టులన్నింటిపై పూర్తి నమ్మకంతో ఉన్నట్టు రవిశంకర్ మాట్లాడుతూ “ మేము చేస్తున్న ఐదు భారీ చిత్రాల్లో ఒక్కటి కూడా యావరేజ్ కాకపోతే, మీరు చెప్పిందే నేను చేస్తాను ” అంటూ ప్రేక్షకులు, మీడియాకు ఛాలెంజ్ విసిరారు. ఇప్పుడు రవిశంకర్ ఇచ్చిన ఈ స్టేట్మెంట్ సినీ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. మైత్రీ మూవీ మేకర్స్ ప్రస్తుతం భారీ పెట్టుబడులతో వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులు చేస్తుండటంతో , 2026లో వారు వరుస సూపర్ హిట్లు అందిస్తారా ? అనే ఆసక్తి అభిమానుల్లో పెరిగింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి