2023లో ‘ఖుషి’ సినిమా విడుదల సందర్భంగా సినీ నటుడు విజయ్ దేవరకొండను లక్ష్యంగా చేసుకుని రవి చేసిన హెచ్చరికను ఇప్పుడు పోలీసులు బయటపెట్టడం మరింత కలకలం రేపుతోంది. ఐబొమ్మ వెబ్సైట్ ద్వారా రవి విజయ్ దేవరకొండను ఉద్దేశించి చేసిన బెదిరింపు సందేశాల్లో,“మా మీద ఫోకస్ చేస్తే, మేము మీ మీద ఫుల్ ఫోకస్ చేయాల్సి వస్తుంది. మీరు ఏజెన్సీలకు డబ్బులు ఇస్తున్నారు కానీ మా వాళ్లను పట్టించుకోవడం లేదు. మమ్మల్ని తొక్కి మా పేరుతో iBOMMAFF.in పేరుతో రన్ చేస్తున్నారు’ అంటూ తమ జోలికి రావద్దని రవి పెట్టిన ఆ మెసేజ్ను పోలీసులు తాజాగా బయటపెట్టారు.
ఈ హెచ్చరికలు అప్పట్లో బయటకు రాలేదు. ఇప్పుడు రవి కస్టడీ సమయంలో పోలీసులకు అన్న విషయాలను బహిర్గతం చేయడంతో, ఈ కేసుకు కొత్త మలుపు తిరిగింది. సినీ పరిశ్రమతో పాటు సైబర్ క్రైమ్ విభాగం కూడా ఈ వ్యవహారాన్ని అత్యంత సీరియస్గా తీసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, రవి ఒంటరిగా కాకుండా ఇంకా కొంతమంది సహచరులతో కలిసి పైరసీ నెట్వర్క్ నడిపినట్లు అనుమానిస్తున్నారు. రవి అంగీకరించిన వివరాలను ఆధారంగా చేసుకుని, ఈ నెట్వర్క్కు సంబంధించిన మరికొంత మందిని గుర్తించే పనిని పోలీసులు వేగవంతం చేశారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి