వీరి పెళ్లి కోయంబత్తూరులోని ప్రసిద్ధ ఇషా యోగా సెంటర్లో, అత్యంత ప్రశాంతమైన, ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగింది. ఈ వేడుకకు కేవలం అత్యంత సన్నిహిత కుటుంబ సభ్యులు, స్నేహితులు మాత్రమే హాజరయ్యారు. పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవగా, వారి సింప్లిసిటీకి అభిమానులు ఫిదా అయ్యారు.లంచ్ మెనూలో ఆర్భాటం.అయితే, పెళ్లి తర్వాత వడ్డించిన భోజనం (వెడ్డింగ్ లంచ్) మెనూ ఇప్పుడు మరింత చర్చనీయాంశమైంది. ఈ లంచ్ ప్లేట్ ఫోటోను సమంతకు అత్యంత ఆత్మీయ స్నేహితురాలు శిల్పా రెడ్డి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ ఫోటోలో కనిపించిన మెనూ చూస్తే.. ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే!
మెనూలో ఎటువంటి లగ్జరీ ఫుడ్ ఐటమ్స్ లేవు. కేవలం దాల్ (పప్పు), వెజిటబుల్ ఫ్రై (కూరగాయల వేపుడు), వడ మరియు కొన్ని సాధారణ సౌత్ ఇండియన్ వంటకాలు మాత్రమే ఉన్నాయి. ఆ భోజనం చాలా సాదాసీదాగా, ఇంటి స్టైల్లో ఉండటంతో.. అభిమానులు, నెటిజన్లు సమంతను అభినందిస్తున్నారు."అంత పెద్ద స్టార్ అయినప్పటికీ, పెళ్లి భోజనాన్ని కూడా ఇంత సింపుల్గా, సాంప్రదాయబద్ధంగా ప్లాన్ చేయడం సమంత వ్యక్తిత్వానికి నిదర్శనం. ఆమె పెళ్లి భోజనం.. ఆమె వ్యక్తిత్వంలా సింపుల్గా.. ప్యూర్గా ఉంది!" అని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో మాస్ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి, స్టార్ డమ్ ఉన్నప్పటికీ, జీవితంలో సింప్లిసిటీని పాటించిన సమంత, రాజ్ దంపతులకు నలుమూలల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి