లోకంలో కరోనా చేస్తున్న మారణహోమం సరిపోనట్లుగా ఉంది కొందరికి.. అది చాలదన్నట్లుగా చంపడాలు, చావడాలు చేస్తున్నారు. అరే మానవ జన్మ ఎత్తాము మంచిగా ఆలోచించి బ్రతుకుదాము అనే ఇంగిత జ్ఞానం కూడా ఉండటం లేదు. అసలు మళ్లీ పూడతామో లేదో కూడా తెలియదు. దేని కోసం బ్రతుకుతున్నామో, ఎందు కోసం చస్తూ, చంపుతున్నామో అర్ధం కాకుండా ఉన్న జీవితం మనుషులది. ఇక ఒకరిని ఒకరు ప్రేమించుకోవడం, గౌరవించు కోవడం ఎప్పుడో మరచిపోయారు.


కుట్రలు చేస్తూ, కుతంత్రాలతో సావాసం చేస్తూ వారిని వారే మోసం చేసుకుంటు బ్రతుకుతున్నారు. ఇప్పుడు చదవబోయే ఘటన చూస్తే ఇలాగే అనిపిస్తుంది. ఎందుకంటే మద్యం మనిషిని మంచివానిగా ప్రవర్తించేలా చేస్తుంది. చెడ్దవానిగా మారేలా చేస్తుంది. ఇక్కడ మాత్రం ఇద్దరు కలిసి తాగిన మద్యం ఒక నిజాన్ని బయటపెడితే, మరొకరి ప్రాణం తీసింది. ఇక తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జరిగిన ఈ దారుణం గురించి తెలుసుకుంటే.


మద్యం మత్తులో సొంత అల్లుడినే కిరాతకంగా నరికి చంపాడో మామ. అనంతరం తలను సంచిలో తీసుకొచ్చి అన్నవరం పోలీసులకు అప్పగించాడట.. కాకినాడ రౌతులపూడి మండలం డీజేపురంలో చోటు చేసుకున్న ఈ ఘటన స్దానికంగా కలకలం రేపింది. ఇక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డీజేపురం గ్రామానికి చెందిన సత్యనారాయణ కుమార్తె పది నెలల క్రితం అనుమానాస్పద స్థితిలో చ‌నిపోయింది. అప్పటినుంచి ఆమె ఇద్ద‌రి కూతుర్లు తాత సత్యనారాయణతోనే ఉంటున్నారు.


ఈ నేపధ్యంలో చనిపోయిన కూతురి భర్త గ‌త‌ రాత్రి తన మామ వాళ్ల ఇంటికి రాగా, కూతురు పోయిన బాధలో ఉన్న ఆ తండ్రి తన అల్లుడు కూడా భార్యను పోగొట్టుకుని బాధపడుతున్నాడని భావించి మద్యం తెప్పించగా ఇద్దరు కలిసి పీకల దాకా తాగారట. తాగితే నిజాలు బయటకు వస్తాయి అన్నట్లుగా అల్లుడు లచ్చన్న మద్యం మత్తులో తన భార్యను తానే చంపినట్లు, పిల్లల్ని కూడా చంపేస్తానని హెచ్చరించాడట..


ఆ మాటలకు కోపోద్రిక్తుడైన సత్యనారాయణ కత్తితో లచ్చన్న తల నరికి, అనంతరం ఆ తలను సంచిలో వేసుకొని అన్నవరం పోలీసు స్టేషన్‌కు వెళ్లి లొంగిపోగా సత్యనారాయణను పోలీసులు అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారట.


మరింత సమాచారం తెలుసుకోండి: