అధికార పార్టీ వైసీపీలో ఎమ్మెల్సీ పదవుల కోలాహలం మొదలైన విషయం తెలిసిందే. ఇప్పటికే ఎమ్మెల్యేల కోటాలో మూడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి. అలాగే ఈ నెలలోనే స్థానిక సంస్థల కోటాలో 8 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. తాజాగా గవర్నర్ కోటాలో నాలుగు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి. కరోనా నేపథ్యంలో ఎమ్మెల్యే, స్థానిక సంస్థల కోటాకు సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికలు వాయిదా పడ్డాయి.