ఏపీ సీఎం జగన్ నేడు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. కంటివెలుగు ఫేజ్‌ 3ను ప్రారంభించేందుకు సీఎం వైయస్‌ జగన్‌ కర్నూలు వస్తున్నారు. తెలిపారు. వృద్ధులకు, పెద్దలకు కంటి పరీక్షలు చేసి అవసరమైన వారికి కంటి అద్దాలు, శస్త్ర చికిత్సలు ఈ పథకం ద్వారా చేయిస్తారు. అంతేకాకుండా మరికొన్ని అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేస్తారు.

 

 

కర్నూలును న్యాయ రాజధానిగా ప్రకటించిన తర్వాత మొదటి సారి జగన్ కర్నూలుకు వస్తున్న నేపథ్యంలో అక్కడ పార్టీ శ్రేణుల్లో ఆనందం నెలకొంది. గతంలో ఆంధ్ర రాష్ట్రంగా ఉన్నప్పుడు కర్నూలు రాజధానిగా ఉన్న సంగతి తెలిసిందే. మళ్లీ ఆరు దశాబ్దాల తరువాత కర్నూలును మళ్లీ న్యాయ రాజధానిగా ప్రకటించి మొట్టమొదటి సారిగా జిల్లా పర్యటనకు వస్తున్న సీఎం వైయస్‌ జగన్‌కు ఘనస్వాగతం పలికేందుకు వైసీపీ శ్రేణులు రెడీ అవుతున్నాయి.

 

కర్నూలు ఎస్‌ఏపీ క్యాంపు నుంచి ఎస్టీబీసీ కాలేజీ వరకు రోడ్డు పొడవునా మానవహారం నిర్వహించబోతున్నారు. ఈమేరకు కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ఏర్పాట్లు చేస్తున్నారు. కర్నూలుకు జ్యుడిషియల్‌ క్యాపిటల్‌ ఇచ్చిన సీఎం వైయస్‌ జగన్‌కు జిల్లా వాసులంతా జీవితాంతం రుణపడి ఉంటారని ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అంటున్నారు.

 

 

నిన్నంతా సీఎం వైయస్‌ జగన్‌ కర్నూలు పర్యటన ఏర్పాట్లను అధికారులతో కలిసి ఎమ్మెల్యే హఫీజ్‌ ఖాన్‌ పరిశీలించారు. ఎస్టీబీసీ కాలేజీ మైదానంలో బహిరంగ సభ ఏర్పాట్లను పర్యవేక్షించారు. మొట్టమొదటి సారి సీఎం హోదాలో కర్నూలుకు వస్తున్న సీఎం వైయస్‌ జగన్‌కు ఘనస్వాగతం పలుకుతామన్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: