ఆలయాలకు ఎంతో పురాతన చరిత్ర ఉండడం, భక్తులకి దృఢమైన నమ్మకం ఉండడం ఇవన్నీ మనకి తెలిసినదే. అటువంటి పురాతనమైన ఈ రధం అగ్ని కి ఆహుతి కావడం నిజంగా బాధాకరం అనే చెప్పాలి. అసలేం జరిగిందో పూర్తిగా చూసేయండి. వివరాల్లోకి వెళితే తూర్పు గోదావరి జిల్లాలోని ప్రసిద్ద పుణ్యక్షేత్రం, అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ప్రాంగణం లో ప్రమాదం చోటు చేసుకుంది. 62 ఏళ్ల చరిత్ర కలిగిన స్వామి వారి రథం అగ్నికి ఆహుతైంది.

ఈ సంఘటన శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత అనగా సుమారు ఒంటి గంట సమయం లో ఈ చోటు చేసుకుంది. ఆలయ సిబ్బంది ఈ రధాన్ని షెడ్డు లో భద్రపరిచారు. ఆ షెడ్డు లో ఉన్న పురాతన రథానికి మంటలు అంటుకొని దగ్ధం అయ్యిపోయింది. అయితే ఈ ఘటన జరగడానికి కారణం ఏమిటి అనేది ఇంకా పూర్తిగా తెలియ లేదు. ప్రమాదవశాత్తు జరిగిందా లేదా విద్రోహ చర్య అన్న అంశం పై పోలీసులు విచారణ చేపట్టడం జరిగింది.

ఈ  ఘటన పై దేవాదాయ శాఖా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. అలానే ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే ఆయన స్పందించడం జరిగింది. వెంటనే దేవ‌దాయ క‌మిష‌న‌ర్ పి.అర్జున ‌రావు‌, జిల్లా ఎస్పీతో ఫోన్ చేసి మాట్లాడడం కూడా జరిగింది. అలానే దేవ‌దాయ, పోలీస్‌, పైరింజ‌న్‌, రెవెన్యూ అధికారుల‌తో కూడా మాట్లాడి ఈ విషయం గురించి ఆయన తెలుసుకోవడం జరిగింది. ఘటనపై లోతుగా దర్యాప్తు జరపాలని క‌మిష‌న‌ర్ రామ ‌చంద్ర ‌మోహ‌న్‌ను విచార‌ణ అధికారిగా నియ‌మించడం జరిగింది.''అంతర్వేది ఘటన దురదృష్టకరం'' అని స్వరూపానందేంద్ర అన్నారు . అలానే రధం ఆహుతి కావడంపై తక్షణం విచారణ జరపాలి అని కూడా ఆయన చెప్పడం జరిగింది. దుండగుల చర్యగా తేలితే కఠినంగా శిక్షించాలన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: