కానీ చైనాలో మాత్రం అలాంటివి ఎక్కడ ఉండదు. అందుకే చైనా ప్రభుత్వం చెప్పిందే శాసనంగా మారిపోతూ ఉంటుంది చైనాలో. అందుకే చైనాలో ఇలాంటివి ఉండవు కాబట్టి పదివేల లోపు వేతనాలు కలిగిన వారు 80 శాతం వరకు ఉంటారు. అందుకే అతి తక్కువ ధరకే చైనాలో ఉత్పత్తి అవుతూ ఉంటుంది. అందుకే అన్ని టెక్ కంపెనీలు చైనాలో తమ కార్యకలాపాలు సాగించడానికి ఆసక్తి చూపుతూ ఉంటాయి. కాగా ఇక ఇప్పుడు టెక్ వర్గం కాస్త చైనాను కాపాడేందుకు సిద్ధమయ్యాయా అంటే ప్రస్తుతం వినిపిస్తున్న వాదన ప్రకారం మాత్రం అవుననే సమాధానమే ఎక్కువగా వినిపిస్తుంది.
దిగ్గజ సంస్థ అయిన యాపిల్ చైనాను కాపాడేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా అయితే కొన్ని టెక్ కంపెనీల లాబీయింగ్ ప్రకారం
ప్రభుత్వాలు కంపెనీల నిబంధనలకు అనుగుణంగా పని చేస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం చైనా పై ఉన్న అంశాలను తగ్గించే విధంగా ఆపిల్ అమెరికా-చైనా మధ్య సంప్రదింపులు జరిపేందుకు సిద్దం అవుతుంది అన్నది ప్రస్తుతం వినిపిస్తున్న వాదన. జపాన్ కు సంబంధించిన అన్ని కంపెనీలు బయటకు వెళ్తూ చైనా నాశనం అయ్యేటువంటి పరిస్థితి వస్తున్న నేపథ్యంలో... టెక్ కంపెనీలు రంగంలోకి దిగి చైనాను కాపాడేందుకు లాబి ప్రారంభించాయి అని ప్రస్తుతం వాదన వినిపించింది. ఇది ఎక్కడి వరకు వెళుతుంది అన్నది మాత్రం భవిష్యత్తులో తేలనుంది.